అమరావతి : ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు అయినట్లు సమాచారం. సోమవారం ప్యాసింజర్లు తక్కువగా ఉండటం, ఇతర సాంకేతిక కారణాలతో విశాఖ, విజయవాడ విమానాలను రద్దు చేశారు. దీనితో చంద్రబాబు విశాఖ పర్యటన రద్దయినట్లు తెలుస్తోంది. అయితే హైదరాబాద్ నుండి ఏపికి వచ్చేందుకు డీజీపీ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబు రోడ్డు మార్గంలో అమరావతికి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సోమవారం ఉదయం హైదరాబాద్ నుండి విమానంలో నేరుగా విశాఖకు, అక్కడి నుండి రోడ్డు మార్గంలో అమరావతికి చేరుకోవాలని చంద్రబాబు ఏర్పాటు చేసుకున్నారు. ఈ మేరకు చంద్రబాబు అభ్యర్థనపై అనుమతి ఇచ్చిన ఏపి డీజీపీ ఇ పాస్ కూడా జారీ చేశారు. అయితే సోమవారం విమాన సర్వీసులు నిలిచిపోవడంతో విశాఖ పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది.