నిన్నటి నుండి సోషల్ మీడియాలో ఒకటే వైరల్ అవుతున్న టాపిక్ ఏదైనా ఉంది అంటే అది చిత్తూరు జిల్లా మదనపల్లి రైతు నాగేశ్వరరావుకు ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ ట్రాక్టర్ పంపడమే. నాగేశ్వరరావుకి ఉన్న టీ కొట్టు తో తన కుటుంబాన్ని పోషించుకునే వాడు. అయితే కరోనా కారణంగా ఆ టీ కొట్టుని మూసివేయాల్సి వచ్చింది. ఇక ఉన్న కొద్ది పొలంలో పంటలు పండించుకొని…. తన పొలం దున్ని విత్తనాలు వేయడానికి అవసరమైన కాడెద్దులు లేవు కాబట్టి తన ఇద్దరు ఆడపిల్లలను వాటి స్థానంలో చేర్చి భార్య విత్తనాలు చల్లుతుంటే పొలం దున్నడం ప్రారంభించాడు. గ్రామంలో ఇది చూసిన వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అది కాస్తా సోనూసూద్ కంటపడింది.
దీంతో సోనూసూద్ గంటల్లోనే వారికి హామీ ఇచ్చేసి మరి కొద్ది గంటల్లో సోనాలికా ట్రాక్టర్ డీలర్ తో మాట్లాడి నాగేశ్వరరావు సాయంత్రానికి ట్రాక్టర్ అందేలా ఏర్పాటు చేశారు. ఇక ఈ తతంగం మొత్తం జరగడానికి ఒక రోజు పట్టింది. మన ప్రతిపక్ష నేత చంద్రబాబు మొత్తం అయిపోయాక ఆ ఇద్దరు ఆడపిల్లలను జీవితాంతం నేను చూసుకుంటాను అని…. వారు ఎంత ఉన్నత చదువులు చదివినా తాను చదివివిస్తానని హామీ ఇచ్చాడు. అంతే ఒక్కసారిగా నెటిజన్లు అతనిపై విరుచుకుపడ్డారు
రాష్ట్రాన్ని గత ఐదేళ్ళు పాలించిన బాబు సరైన ఉపాధి రైతు కల్పించకపోగా ఇప్పుడు ఎవరో బయట రాష్ట్రం వాడు వచ్చి సాయం చేస్తుంటే అందులో ఒక చేయి వేసి ఘనతను పొందేందుకు వచ్చాడని అంతా అతని విమర్శించారు. వీలైతే వేరే ఎవరికైనా సహాయం చేయాలి లేదా ఇలాంటి వారి కష్టాలను అధికారపక్షం ముందుకు తీసుకుని వెళ్లాలి కానీ అయిపోయిన పనిలో వచ్చి కల్పించుకుని ఇమేజ్ పెంచుకోవడం తగదని… అధికారపక్షాన్ని విమర్శించే సమయంలో ఇటువంటి విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తే లాభం ఉంటుందని హితవు పలకడం స్టార్ట్ చేశారు. ఈ కామెంట్లకు ఒక్కసారిగా చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయిపోయి ఉంటుంది.