ప్రస్తుతం ఏపీలో బలమైనవి.. నిలిచినవి.. నిలిచేవి కూడా రెండు పార్టీలుగా వ్యవహారం ఉంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను చూస్తుంటే… ఇక ఎప్పటికీ ఏపీలో వైకాపా – టీడీపీ ల మధ్య మాత్రమే యుద్ధం ఉండే అవకాశం ఉంది! మధ్యలో జనసేన వచ్చినా కూడా… ఆ పార్టీ పరిస్థితి ఆటలో అరటిపండు అయిపోయింది! బీజేపీతో జతకట్టినా కూడా చూపించిన ఇంపేక్ట్ జనాలు గ్రహించేస్థాయిలో లేదు! ఫలితంగా పెద్ద మార్పేమీ కనిపించలేదు. ఈ క్రమంలో ఏపీలో ఎప్పటికీ ఈ రెండు పార్టీలే ఉండేలా చూసుకోవడంలో జగన్ – బాబు పరోక్షంగా చేతులు కలిపి పనిచేస్తున్నాయన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి!!
ఒకరికి ఒకరు తెలియకుండానే ఒక్క విషయంలో మాత్రం ఏకతాటిపైన ఉన్నారనే చెప్పాల్సిన విషయం ఏమిటంటే… ఏపీలో జాతీయ పార్టీలకు అవకాశం లేకుండా చేయడం!! ఏపీలో ఇంతకాలం టీడీపీ వైభవం నడిచింది. ప్రస్తుతం వైకాపా ఆధిపత్యం చెలాయిస్తుంది. ఈ పరిస్థితుల్లో అటు జగన్ ని ఒకవర్గంతో గ్రిప్ లో పెట్టుకుంటూ.. ఇటు చంద్రబాబుని కూడా మరో వర్గంతో కాపాడుకుంటూ.. బీజేపీ పెద్దలు స్కెచ్ లు గీస్తున్న సంగతీ తెలిసిందే. అందులో భాగంగా జీవీఎల్, సోము వీర్రాజు లాంటి వారు జై జగన్ అంటుంటే… కన్నా – సుజనా లాంటివారు జై చంద్రబాబు అంటుంటారు.
ఈ విషయంలో ఎవరి వ్యక్తిగత అజెండాలు వారికి ఉన్నప్పటికీ… ఫైనల్ గా పార్టీ అజెండా మాత్రం… భవిష్యత్తులో ఏపీలో కాషాయం కీలకం కావాలన్నదే! ఈ విషయంలో అటు చంద్రబాబు అయినా.. ఇటు జగన్ అయినా వారిని ఎక్కడౌంచాలో అక్కడే పెడుతున్నారు తప్ప… దేహీ అనడం లేదు! దానికి కారణం… ఒక్కసారి రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు, జాతీయ పార్టీలు పెత్తనం చేయడం మొదలుపెడితే… అభివృద్ధి, ఆశలు అడుగంటిపోతాయని!! కష్టమో సుఖమో స్థానిక పార్టీల చేతిలో రాష్ట్రం ఉంటే ఆ లెక్క వేరు.. ఒక్కసారి కేంద్రం పెద్దలు పెత్తనం మొదలుపెడితే.. లోకల్ పీపుల్ అభిప్రాయాలకు విలువ ఉండదు!!
ఈ విషయాలను గ్రహించిన బాబు – జగన్ లు ఒకరికి తెలియకుండా ఒకరు పరోక్షంగా చేతులు కలిపి సాగిస్తున్న వ్యవహారంగా ఈ విషయాన్ని చూడాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.