రాష్ట్రంలో జరిగే రాజకీయాన్ని పోయి పోయి రాష్ట్రపతికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మొరపెట్టుకోవడాన్ని ఎలా భావించాలి? రాష్ట్రపతి తనకు వచ్చిన విన్నపాలను మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికే పంపుతారు తప్ప ప్రత్యక్షంగా ఆదేశాలు ఎలా ఇస్తారు?చంద్రబాబుకి ఇవన్నీ తెలియదనుకోవాలా!
మరి ఆయనఈ తరహా రాజకీయ౦ ఎందుకు చేస్తున్నారన్నది ఇప్పటి ప్రశ్న.దీనిపై రాజకీయ పరిశీలకుల విశ్లేషణ ఏమి టంటే ఏపీలో జరిగే పరిణామాలు రాష్ట్రపతికి ఫిర్యాదు చెయడం ద్వారా జాతీయ స్థాయిలో హైలెట్ కావాలన్నదే చంద్రబాబు ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. వీలుంటే జాతీయ మీడియా సాయంతో ఏపీలోని జగన్ సర్కార్ మీద వ్యతిరేక రాతలు రాయించాలన్న ఉత్సాహం అయితే కనిపిస్తోంది. అంతే కాదు ఇంకా ఏమైనా కుదిరితే కేంద్రంలోని మోడీ సర్కార్ ని ఏమైనా కదిలించాలన్న ఆశ కూడా కనిపిస్తోంది. ఇవన్నీ టీడీపీకి ఉన్న ఆలోచననే కానీ అక్కడ ఢిల్లీలో సీన్ మాత్రం వేరేగా ఉందని అంటున్నారు. ఏపీ లో జరుగుతున్న పరిణామాలు కేంద్రానికి తెలియకుండా ఉండవు..అంతే కాదు రాష్ట్రపతి సైతం గవర్నర్ ద్వారా అవసరమైన సమాచారాన్ని తెప్పించుకోకుంటారు. ఫిర్యాదు చేసిన టీడీపీ మాటలను వారు వూరికే నమ్మేస్తారా బాబూ?
కాగా కేంద్రంలోని మోడీ సర్కార్ మద్దతు ఇపుడు చంద్రబాబుకు అత్యవసరం.
మోడీ కనుక గట్టి భరోసా ఇస్తే కాని చంద్రబాబుకు శాంతి ఉండదు, ఆయనకు పట్టిన రాజకీయ హైరానా కూడా తీరదు. కానీ మోడీ స్విచ్ కాదు గా అవసరమైనపుడు వేస్తే వెలగడానికి, లేకపోతే ఆఫ్ లైన్ మోడ్ లోకి పోవడానికి. ఎన్నికల ముందు వరకూ తిట్టి ఇపుడు తన రాజకీయ అవసరాల కోసం మోడీని దేవుడు అని చంద్రబాబు అంటే ఆయన ఉబ్బిపోతారు అనుకుంటే అది అవివేకం !
కేంద్రం కరుణాకటాక్షం అయితే బాబుకి ఇపుడున్న రాజకీయ వాతావరణంలో లభించేది కాదు. అది ఆ మాత్రం రాజకీయాలపైన అవగాహన ఉన్నవారదందరికీ అర్ధమయ్యే విషయం. పైగా ఇప్పటి వరకు అత్యంత సమర్ధుడనిపించుకున్న చంద్రబాబు ఈ తరహా చర్యల ద్వారా తన సొంత ఇమేజ్ ని కూడా కోల్పోతున్నారు అది టిడిపికి తీవ్రంగా నష్టం చేసే అవకాశముంది!