40 ఏళ్ల రాజకీయ అనుభవం పైగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు తాజాగా తన కంటే చిన్నవాడైన జగన్ ని ఎదుర్కోవడం కోసం చేస్తున్న వ్యాఖ్యలు ఆయన నీ నవ్వుల పాలు చేస్తున్నట్టు ఏపీ పాలిటిక్స్ లో టాక్. ఏనాడు లేని విధంగా మత రాజకీయాలకు తెర లేపుతూ.. లేటెస్ట్ గా హిందుత్వ ఎజెండాతో జగన్ ని టార్గెట్ చేస్తూ బాబు చేస్తున్న వ్యాఖ్యల పట్ల సొంత పార్టీలోనే తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తున్నసంగతి తెలిసిందే.
ఇటువంటి తరుణంలో తాజాగా చంద్రబాబు మరోసారి జగన్ ని టార్గెట్ చేసుకుని చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడు రాజకీయాలకి నిదర్శనమని చాలామంది చెప్పుకొస్తున్నారు. పరిస్థితి ఇలా ఉండగా వివిధ సామాజిక వర్గాలకు జగన్ ని దోషిగా చూపించడానికి ఏదో లోపం ఎత్తి చూపాలన్న తపన బాబులో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పుకొస్తున్నారు.
విషయంలోకి వెళితే పులివెందుల నియోజకవర్గంలో హత్యాచారానికి గురైన దళిత మహిళ కుటుంబాన్ని ఏ మాత్రం పలకరించకుండా.. అదే నియోజకవర్గంలో అబ్దుల్ సలామ్ బంధువులను గెస్ట్ హౌస్ కు పిలపించుకొని జగన్ పరామర్శించడం దారుణమని చంద్రబాబు విమర్శించారు. ఇదే తరుణంలో తిరుపతి నియోజకవర్గంలో సొంత పార్టీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మరణిస్తే.. ఆయన కుటుంబాన్ని సీఎం కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడారని.. అదే ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి చనిపోతే.. ముఖ్యమంత్రి వారి ఇంటికి వెళ్లి వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడారని తెలిపారు. అసలు ముఖ్యమంత్రికి ఉండాల్సిన సామాజిక న్యాయం ఇదేనా అని ప్రశ్నించారు. దీంతో చంద్రబాబు వ్యాఖ్యలు విని చాలా మంది మతాలతో అదేవిధంగా కుదిరితే కులాలతో ఏదో రీతిలో జగన్ ని జనాల ముందు తక్కువగా చూపించడానికి మరీ చిల్లర రాజకీయ నేతగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని తాజాగా ఆయన చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో విమర్శలు వినబడుతున్నాయి. పాలసీ పరంగా కాకుండా చంద్రబాబు మరీ దిగజారిపోయి ఈ రీతిలో విమర్శించటం బట్టి చూస్తే జగన్ ని ఎదుర్కొనలేక పోతున్నట్లు వైసీపీ పార్టీకి సపోర్ట్ గా ఉన్న వాళ్ళు అంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?