Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ – క్రాక్ సినిమాతో మంచి ఫాంలోకి వచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఒక సినిమా మొదలవబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ దీనికి నిర్మించబోతోంది. బాలకృష్ణ సినిమా అంటే నందమూరి అభిమానులలో రెట్టింపు ఉత్సాహం కలుగుతుంది. ఈ మధ్యన బాలయ్య సినిమాలు అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు. బయోపిక్స్ కూడా బాగా నిరాశపరచాయి. అందుకే ఇప్పుడు రూపొందుతున్న మాస్ ఎంటర్టైనర్ అఖండ మీద భారీ అంచనాలు నెలకొలిపారు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను – బాలయ్య కాంబో అంటే అందరికి ఇంతక ముందు వీరి కాంబినేషన్లో వచ్చిన సింగ, లెజెండ్ సినిమా భారీ కమర్షియల్ సక్సెస్ ను అందుకున్నాయి. ఇప్పుడు రాబోతున్న అఖండ హ్యాట్రిక్ సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి.
ఆ అంచనాలను అఖండ పోస్టర్స్, టీజర్స్ రెట్టింపు చేశాయి. కాగా ప్రస్తుతం అఖండ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. యంగ్ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య దర్శకులను నమ్మి ప్రాజెక్ట్ ని, స్టోరీని ఓకే చేస్తాడు. ఒక్కసారి స్క్రిప్ట్ ఫైనల్ అయితే మధ్యలో ఏమాత్రం జోక్యం చేసుకోరనే టాక్ ఉంది. నన్ను
ప్రేక్షకులు , అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించడానికి దర్శకులు వాళ్ళ శాయశక్తులా ప్రయత్నిస్తారు. నన్ను దృష్టిలో పెట్టుకొనే కథ, డైలాగులు రాస్తారు. నన్ను ఎలా చూపిస్తే అభిమానులు ఆనందపడతారో నాకన్నా వాళ్ళకే బాగా తెలుసు అని బాలయ్య చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.
Balakrishna : వివాదాలు లేవనెత్తడం చేయకూడదనే బాలయ్య కొన్ని మార్పులు చెప్పారట.
అయితే ఈసారి మాత్రం కథ విషయంలో కొన్ని సూచనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. బాలయ్య తన తరువాత సినిమా విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. అందుకు కారణం ఇది వాస్తవ సంఘటనలతో తెరకెక్కనున్న సినిమా కావడమే. బాలయ్య అఖండ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమా చేయనున్న విషయం ఇప్పటికే అధికారకంగా వెల్లడించారు. ఈ సినిమాను కూడా కంప్లీట్ మాస్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో బాలయ్య 107 గా రాబోతోంది. వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలో నటిస్తోందట. వాస్తవ కథ కాబట్టి తర్వాత ఎవరూ వచ్చి సినిమా విషయంలో కామెంట్స్ చేయడం, వివాదాలు లేవనెత్తడం చేయకూడదనే బాలయ్య దర్శకుడు గోపీచంద్ మలినేనికి సలహాలిచ్చి కొన్ని మార్పులు చెప్పారట.