Ganguly-Chappell: సౌరభ్ గంగూలి-గ్రెగ్ చాపెల్ Ganguly-Chappell వివాదం గురించి సగటు క్రికెట్ అభిమాని మర్చిపోలేరు. ఇండియా క్రికెట్ చరిత్రలో మ్యాచ్ ఫిక్సింగ్ అంశం తర్వాత అంతటి వివాదాస్పదైన అంశం చాపెల్ కోచ్ గా ఉన్న రెండేళ్ల కాలం 2005-07 మధ్య కాలమే. ఇప్పుడు ఈ వివాదంపై గ్రెగ్ చాపెల్ మరోసారి స్పందించాడు. ‘గంగూలి వల్లే టీమిండియా వైఫల్యాల బాట పట్టింది. టీమ్ విజయం గురించి కాకుండా తన కెప్టెన్సీ, సెంచరీల గురించి ఆలోచించేవాడు. ద్రవిడ్ ఉత్తమ ఆటగాడని.. తెలివైన కెప్టెన్. కానీ.. టీమ్ సభ్యులు సహకరించ లేదు. అందుకే 2007 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్, శ్రీలంక జట్లతో తొలి రౌంలోనే ఓడి వెనుదిరిగింది’.
‘అలా జరిగింది కాబట్టే టీమ్ అంతా సరిగా ఆడకపోతే తమవరకూ వస్తుందని భయపడ్డారు. భారత్ గెలవాలనే తపన ద్రవిడ్ లో ఉన్నంతగా గంగూలీలో ఉండేది కాదు. భారత్ ను ప్రపంచంలో అత్యుత్తమ జట్టుగా నిలపాలని తాపత్రయపడేవాడు. కొందరు సీనియర్లు సహకరించలేదు. వారి కెరీర్లు చివరి దశలో ఉన్నాయి. గంగూలిని టీమ్ నుంచి తప్పించడం సరైందే. అతను మళ్లీ టీమ్ లోకి వచ్చాక వాళ్లకి ధైర్యం వచ్చింది. నా నిర్ణయాలు వివాదాస్పదంగా మారినా.. టర్మ్ పూర్తయ్యాక మళ్లీ కోచ్ గా ఉండమని బీసీసీఐ కోరింది. కానీ.. ఆ టెన్షన్ భరించలేనని చెప్పి ఆఫర్ తిరస్కరించాను’ అని ఓ స్పోర్ట్స్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
గంగూలీ కెప్టెన్సీలో సచిన్, గంగూలి, ద్రవిడ్, సెహ్వాగ్, లక్ష్మణ్, ధోనీ, ఇర్ఫాన్ పఠాన్, జహీర్, హర్భజన్.. లతో టీమ్ పటిష్టంగా ఉంది. కొత్త కోచ్ ను తీసుకునే క్రమంలో బీసీసీఐ డేవ్ వాట్ మోర్, గ్రెగ్ చాపెల్ ను ఆప్షన్ గా పెట్టింది. గంగూలి చాపెల్ వైపు మొగ్గు చూపాడు. కానీ.. గంగూలీ ఆధిపత్యానికే గండి కొట్టాడు చాపెల్. టీమిండియాలో పెను మార్పులు వచ్చాయి. చాపెల్ వద్దు గంగూలీ.. అని స్టీవ్ వా అప్పట్లో చెప్పినా గంగూలి వినలేదు. టాప్ బౌలర్ గా ఉన్న ఇర్ఫాన్ ను వన్ డౌన్ లో దింపి రాణించేలా చేసినా.. అతడి బౌలింగ్ పై దెబ్బపడి భారత్ విజయావకాశాలపై దెబ్బ పడింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ విషయాలు వైరల్ అయ్యాయి.