Charging smartphones: మనలో చాలామందికి ఉండే అలవాటు ఏమిటంటే స్మార్ట్ ఫోన్ Charging smartphones కు రాత్రిపూట చార్జింగ్ పెట్టి ఫోన్ ని ఆలా వదిలేయడం. స్మార్ట్ ఫోన్ ని ఉపయోగిస్తున్న వారిలో దాదాపు యాభై శాతం మంది ఇలానే చేస్తూ ఉంటారు. రాత్రి ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి నిద్రపోతుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఛార్జింగ్ తీస్తారు. ఇక మీరు నిద్రపోయినంతసేపు మీ ఫోన్ ఆలా ఛార్జింగ్ అవుతూనే ఉంటది. అయితే చాలా మంది ఫోన్ ని ఆలా ఫుల్ ఛార్జ్ అయ్యాక కూడా అన్ని గంటలు ఛార్జింగ్ పెట్టి ఉంచకూడదని ఆలా చేస్తే మొబైల్ లోని బ్యాటరీ పాడైపోతుంది అని అంటుంటారు. అంతేకాకుండా ఇలా చేయడం వలన ఫోన్ బ్యాటరీలు పేలే ముప్పు కూడా ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
మొబైల్ ఫోన్స్ లో ముఖ్యంగా కీప్యాడ్ ఫోన్లను మాత్రం ఇలా అస్సలు వదిలేయొద్దని సూచిస్తున్నారు. కీప్యాడ్ ఫోన్స్ కి అలా రాత్రంతా చార్జింగ్ పెట్టి వదిలేస్తే అందులోని బ్యాటరీ ఉబ్బిపోయి పేలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కానీ ఇక్కడ గమనించవలసిన మరో విషయం ఏమిటంటే ఈ ఇబ్బంది కేవలం కీప్యాడ్ ఫోన్ లకే కానీ కొత్త స్మార్ట్ ఫోన్స్ కి కాదట. ప్రస్తుతం మార్కెట్ లోకి వస్తోన్న స్మార్ట్ఫోన్ల లో ఈ ఆప్షన్ ని ఇన్-బిల్ట్ గా ఉంచి తయారు చేస్తున్నారట. ఇక కొత్త స్మార్ట్ ఫోన్స్లో బ్యాటరీ ఫుల్ గా ఛార్జ్ అయ్యాక ఆటోమేటిక్ గా ఛార్జింగ్ ప్రక్రియ ఆగిపోయేలా రూపొందిస్తున్నారట.
కాబట్టి నేటి తరం స్మార్ట్ ఫోన్స్ లో ఈ సదుపాయం ఉండడంతో బ్యాటరీ పేలిపోతుందనే సందేహం అక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు. శ్యామ్ సంగ్ వంటి పెద్ద కంపెనీల ఫోన్లే పేలిపోతున్నందున ఇతర కంపెనీల ఫోన్లు మీద ఎలా నమ్మకం ఉంచగలం? అందుకే చార్జింగ్ ఫుల్ అవ్వగానే చార్జర్ నుంచి తీసేయడం మంచిదని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.