ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూ ఉండడంతో కేంద్రం ప్రైవేటు ల్యాబ్ లకు కూడా కరోనా టెస్టుల చేసేందుకు అనుమతిని ఇచ్చింది. అయితే దొరికిందే ఛాన్స్ అని వేలాది వేల రూపాయలు టెస్టుల పేరుతో వారు దండుకోకుండా ఒక ఆంక్షను విధించింది.
జగన్ సర్కారు ప్రతి ప్రతీ ఒక్క ప్రైవేట్ ల్యాబ్ కు ఒక్క టెస్ట్ కేవలం 2900 రూపాయలు మాత్రమే తీసుకోవాలని ఫిక్స్ చేశారు. అంతకుమించి ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా అది ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించినట్లే. ఇకపోతే టెస్టులు నిర్వహించే ల్యాబ్ లకు ఐసీఎంఆర్, ఎన్ఏబిఎల్ గుర్తింపు కలిగి ఉండాలని షరతు విధించింది.
పక్క రాష్ట్రం నుండి మరియు పొరుగు దేశం నుండి ఆంధ్ర రాష్ట్రం లోకి వచ్చిన వారి వల్ల కరోనా కేసులు రోజు రికార్డు స్థాయిలో నమోదు అవుతుండడంతో ప్రభుత్వం ఇక టెస్టుల సంఖ్య పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఐదు లక్షలకు పైగా టెస్టుల చేసిన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?