Ameesha Patel: పవన్ కళ్యాణ్ అలనాటి బాలీవుడ్ హీరోయిన్ అయినటువంటి అమీషాపటేల్ పై మధ్య ప్రదేశ్ లో చీటింగ్ కేసు నమోదైంది. డబ్బులు తీసుకుని మోసం చేసిందనే ఆరోపణలతో ఓ ఈవెంట్ ఆర్గనైజర్లు MP పోలీసుల్ని ఆశ్రయించగా అమీషాపై పోలీసులు కేసు ఫైల్ చేసినట్టు సమాచారం. అసలు విషయంలోకి వెళితే, ఇటీవల మధ్యప్రదేశ్ లో ని ఖాండ్వాలో ఓ కార్యక్రమం కోసం ఈవెంట్ అర్గనైజర్లు అమీషాని బుక్ చేసుకున్నారట. ఈవెంట్ లో ఓ గంట పాటు పాల్గొనుకుందేకు అమీషాతో అగ్రిమెంట్ కూడా చేసుకున్నారట వారు. అందుకు కొంత పారితోషికంతో కూడిన అగ్రిమెంట్ చేసుకోవడం కూడా జరిగిందట. ఈ క్రమంలో మొత్తం పేమెంట్ ముందుగానే అమీషాకి చెల్లించారట ఆ ఈవెంట్ ఆర్గనైజర్లు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అక్కడే వచ్చింది అసలు చిక్కు?
అయితే, ఆ ఈవెంట్ కి హాజరైన అమీషా మాత్రం స్టేజ్ పై కేవలం 10 నిమిషాలు కాలక్షేపం చేసేసి, తరువాత స్టేజ్ దిగి ఆదరాబాదరా వెళ్లియిందిట. దీంతో చిర్రెత్తిన ఈవెంట్ మేనేజర్ ఆమెపై చీటింగ్ కేసు పెట్టాడు. ఈ నేపథ్యంలో వివాదంపై తాజాగా అమీషా ఈ విధంగా స్పందించింది. ”నేను ఈవెంట్ కి వెళ్లిన మాట వాస్తవం. సిటీలోని నవచండి ఉత్సవాలకు హాజరయ్యాను. కానీ స్టార్ ప్లష్ ఎంటర్ టైన్ మెంట్స్, అరవింద్ పాండే ఈ కార్యక్రమాన్ని చాలా చెత్తగా నిర్వహించారు. ఈవెంట్ లో నిర్వహణ లోపాలున్నాయి. కనీసం నాకు భద్రత కూడా కల్పించలేకపోయారు. దీంతో నాకు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. చాలా భయమేసింది. దాంతో నేను అక్కడినుండి బయటకి వచ్చేసాను” అని చెప్పుకొచ్చింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Ameesha Patel: అమీషా చెప్పిన మరిన్ని మాటలు
ఆమె ఇంకా మాట్లాడుతూ… “ఆ సమయంలో అభిమానులు కాస్త ఇబ్బంది పెట్టారు. దాంతో స్థానిక పోలీసులు రక్షణ కల్పించారు. అందుకు వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇలాంటి ఈవెంట్లకి హాజరవ్వడం నాకు కొత్తేం కాదు. తరుచూ వెళ్తుంటాను. కానీ ఇక్కడ పరిస్థితి వేరేలా వుంది. వీళ్లు మాత్రం భద్రత కల్పించడంతో విఫలమయ్యారు. వేదికపై 1 గంట సేపు ఉన్నాను. నన్ను పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో పోలీసుల సహాయంతో నెమ్మదిగా కారెక్కి వెళ్లిపోయాను!” అని తెలిపింది.