Check : చెక్ సినిమా ఈ నెల 26 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించాడు. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో లాయర్ పాత్రలో నటించగా.. యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ సెకండ్ హీరోయిన్ గా కనిపించబోతోంది. టాలెంటెడ్ డైరెక్టర్ చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వం వహించాడు.
ఈ సినిమా కంప్లీట్ గా దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి పంథాలోనే సాగుతుందని నితిన్ తాజాగా వెల్లడించాడు. చంద్ర శేఖర్ యేలేటి తెరకెక్కించే సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటున్న సంగతి తెలిసిందే.
సినిమా సినిమాకి గ్యాప్ తీసుకుంటున్న చంద్ర శేఖర్ యేలేటి ఎప్పుడొచ్చినా అద్భుతమైన కథతోనే వస్తాడు. ఈసారి కూడా చెక్ అలాంటి కథే అంటున్నాడు నితిన్. చెక్ అనేది జైలు శిక్ష సమయంలో చెస్ ఆడిన ఒక అమెరికన్ ఖైదీ కథ ఆధారంగా తెరకెక్కించిన సినిమా అంటున్నారు. మరణశిక్షను ఎదుర్కొంటున్న ఖైదీ ఆదిత్య పాత్రలో నితిన్ నటించాడు. వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాతో నితిన్ ఖాతాలో మరో సూపర్ హిట్ పడబోతోందని చాలా నమ్మకంగా ఉన్నాడు. గత ఏడాది భీష్మ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నితిన్ ఈ ఏడాది వరసగా సినిమాలని రిలీజ్ చేస్తున్నాడు.
Check : నితిన్ కీర్తి సురేష్ నటించిన రంగ్ దే వచ్చే నెల 26 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి చీఫ్ గెస్ట్ గా రానున్నారని సమాచారం. కాగా నితిన్ కీర్తి సురేష్ నటించిన రంగ్ దే అన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ వచ్చే నెల 26 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అలాగే బాలీవుడ్ సినిమా అంధాదున్ తెలుగు రీమేక్ కూడా జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నభా నటేష్తో పాటు తమన్నా కీలకపాత్ర పోషిస్తోంది. మొత్తానికి ఈ ఏడాదిలో మూడు సినిమాలతో రావడానికి నితిన్ సిద్ధమవుతున్నాడు.