Chennai Test : ఇంగ్లాండ్ తో జరుగుతున్నరెండో టెస్టు లో బౌలింగ్ ఆల్ రౌండర్ రవి చంద్రన్ అశ్విన్ అద్భుతమైన సెంచరీ చేసాడు. భారత్ రెండో ఇన్నింగ్స్ లో ఒక వైపు వికెట్లు పడుతున్నప్పటికీ , స్ట్రెయిక్ రొటేట్ చేస్తూ చారిత్రాత్మక శతకాన్ని లిఖించాడు.. ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు..
అశ్విన్ కెరీర్ లో 5 వికెట్స్ తీసి , సెంచరీ బాదడం ఇది మూడోసారి. 237 పరుగుల వద్ద 9 వ వికెట్ కోల్పోయినప్పుడు 80 స్కోర్ ఉన్న అశ్విన్ , సిరాజ్ తో కలిసి 31 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యంలో సిరాజ్ చేసింది కేవలం ఒక్కే ఒక్క పరుగు మాత్రమే..
సొంత గడ్డ చెన్నై లో 134 బాల్స్ లో సెంచరీ కొట్టి అదరగొట్టాడు. 14 ఫోర్స్, ఒక సిక్సర్ కొట్టాడు.. స్టేడియం లోని ప్రేక్షకులంతా అశ్విన్..అశ్విన్ అంటూ అరుస్తున్నారు. అశ్విన్ కెరీర్ లో ఇది 5వ సెంచరీ. ప్రస్తుతం భారత్ స్కోర్ 270/9 గా ఉంది. 465 పరుగుల ఆధిక్యంలో ఉంది. మొదటి ఇన్నింగ్స్ లో 5 వికెట్స్ పడగొట్టాడు..