న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం బెయిల్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న ఆయన బెయిల్ పిటిషన్పై విచారణకు మరో అడ్డంకి ఎదురైంది. ఈ కేసులో అరెస్ట్ చేయకుండా తాత్కాలిక రక్షణ కోరుతూ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లో లోపాలున్నట్టు తేలింది. సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ సమగ్ర పరిశీలన లేకుండానే పిటిషన్ ఫైల్ చేసినట్టు సమాచారం. అంతకుముందు ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ.. ఇప్పటికిప్పుడు ఆదేశాలు జారీ చేయలేమన్నారు. ఈ కేసును చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్కు బదిలీ చేశారు. ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. తాను సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకుంటానని, అంతవరకూ తనను అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పించాలంటూ చిదంబరం చేసిన వినతిని కూడా తోసిపుచ్చింది. అప్పటి నుంచి చిదంబరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరోవైపు ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి.
previous post
next post