క్యాసినో హవాలా లావాదేవీలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ వ్యవహారాలపై సోషల్ మీడియాలో విపరీతంగా కథనాలు వస్తున్నాయి. చీకోటి ప్రవీణ్ కుమార్ తో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీ నేతలతో సంబంధాలు ఉన్నాయంటూ వార్తలు రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలపై చీకోటి ప్రవీణ్ స్పందించారు. తప్పుడు కథనాలపై హైదరాబాద్ లోని సీసీఎస్ పోలీసులకు చీకోటి ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. తన పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి తనను ఇబ్బంది కల్గేలా, తన పేరును కించపరిచేలా పోస్టులు పెడుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫేక్ అకౌంట్ వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నానని పేర్కొన్నారు.
ఏపి సీఎం వైఎస్ జగన్ తో తనకు సంబంధాలు ఉన్నాయని వస్తున్న ప్రచారంలో నిజం లేదని చీకోటి ప్రవీణ్ తెలిపారు. అదే విధంగా త్రిదండి చిన్న జీయర్ స్వామితో కూడా తనకు పరిచయం లేదని చెప్పారు. కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రవీణ్ అన్నారు. గోవా, థాయిలాండ్, నేపాల్ తదితర ప్రాంతాల్లో క్యాసినో ఈవెంట్ లు నిర్వహించిన చీకోటి ప్రవీణ్ ..హవాలా లావాదేవీలు నిర్వహించినట్లు ఈడీ గుర్తించింది. ఈ అంశంలో ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తుండటంతో అతనితో లావాదేవీలు నిర్వహించిన ప్రముఖులు, సన్నిహితంగా మెలిగిన వ్యక్తులు ఆందోళనకు గురవుతున్నారు.
కేంద్రంపై స్వరం పెంచిన వైసీపీ ..ఎంపీ విజయసాయి మరో సారి ఘాటు వ్యాఖ్యలు
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?