Child: పిల్లలు ఈ నక్షత్రాలలో పుడితే శాంతి చేసుకోవాలిసిన అవసరం లేదు!! చిత్త నక్షత్రములో 1 వ పాదములో పుట్టిన శిశువు వలన తండ్రికి, 2 వ పాదం లో పుడితే తల్లికి, 3 వ పాదం లో పుడితే తోడ పుట్టిన వారికి 1.దోషం ఉంటుంది. నాలుగో పాదంలో పుట్టిన వారికి సామాన్య దోషం మాత్రమే ఉంటుంది. స్వాతి నక్షత్రంలో 1,2 ,3, 4 ఏ పాదం లో శిశువు పుట్టిన కూడా ఎటువంటి దోషం ఉండదు.
విశాఖ నక్షత్రంలో పుట్టిన బిడ్డ వలన బావకు, మరిదికి దోషం ఉంటుంది . 1, 2, 3 ,4 ఏ పాదములో పుట్టిన బంధువులు కు గండం ఉంటుంది. కాబట్టి విశేష శాంతి చేయించుకోవడం మంచిది.
Child: అనూరాధ నక్షత్రం లో 1, 2, 3 ,4 పాదములో పుట్టిన వారి వలన ఎటువంటి దోషం ఉండదు.
జ్యేష్ట నక్షత్రము అనేది విశేష శాంతి చేసుకోవాల్సిన నక్షత్రం అని చెప్పబడింది. దీనిలో 1, 2 ,3 ,4 ఏ పాదములో పుట్టిన కూడా దోషం ఉంటుంది. బిడ్డ పుట్టిన రోజు ఉన్న జ్యేష్ట నక్షత్రము మొత్తం సమయాన్ని 10 భాగాలు విభజించి అందులో ఏ భాగంలో జన్మిస్తే ఆ భాగం తో సంభందం కలవారికి తప్పక నాశనం అనేది కలుగుతుంది . 1 వ భాగంలో పుడితే తాతయ్య 2 వ భాగము లో పుడితే అమ్మమ్మ కు ౩ వ భాగములో పుడితే తల్లి తోడ బుట్టిన వారికి , మేనమామలకు 4 వ భాగము పుడితే అన్నలకు, అక్కలకు 5 వ భాగంలో పుడితే శిశువునకు 6 వ భాగంలో పుడితే ఎవ్వరికి దోషం ఉండదు 7 వ భాగంలో పుడితే వివాహ సమయంలో అత్తగారు బంధు వర్గమునకు 8 వ భాగము లో పుడితే జాతకునకు 9 వ భాగం లో పుడితే తల్లికి 10 వ భాగము లో పుడితే తండ్రికి దోషం ఉంటుంది.
నాలుగో పాదం లో పుడితే తండ్రికి దోషం వస్తుంది. ఇది సుమారు 9 నెలలు పాటు ఉంటుంది . గోవును దానం చేయడం వలన శాంతి కలుగును. దీనితో పాటు విశేష శాంతి చేయించుకోవాలి.మూల నక్షత్రం ప్రారంభం లో 24 నిమిషాలు సంధి కాలం ఉంటుంది. మూలా నక్షత్రంలో 1 వ పాదం లో పుడితే తండ్రి, 2 వ పాదము లో పుడితే తల్లి, ౩ వ పాదము లో పుడితే ధనమునకు నాశనం జరగడం . 4 వ పాదం లో పుడితే దోషము ఉండదు. మూలా నక్షత్రం ఉన్నప్పుడు ఆ సమయాన్ని మొత్తం 12 భాగాలుగా చేసి దోషమును కనుక్కోవాలి.
ఈ 12 భాగాలలో 1 వ భాగము లో పుడితే తండ్రికి 2 వ భాగము లోతల్లికి ౩ వ భాగము లో అన్నలకు 4 వ భాగము లో భాగస్వాములకు 5 వ భాగం లో పిల్లనిచ్చిన మామ గారికి 6 వ భాగం చిన్నాన్న, పెద్ద నాన్నలకు 7 వ భాగం లో పిన్నమ్మ , పెద్దమ్మ లకు మరియు మేనమామలకు 8 వ భాగము లో ధనమునకు 9 వ భాగం లో జీవన నాశనం 10 వ భాగము లో దరిద్రమును కల్గిస్తుంది 11 వ భాగం లో భృత్యులు 12 వ భాగము లో జాతకునికి నాశనం జరుగుతుంది.కొన్ని సార్లు నక్షత్రం లో సమస్య లేకపోయినా కూడా దుష్ట తిధి దోషం ఉండటం వలన , వర్జ్యము ఉండుట వలన , దుర్ముహూర్త కాలము ఐన , గ్రహణ సమయం లో పుట్టిన వారికి శాంతి చేయించుట తప్పనిసరి.