Children: టెక్నాలజీ పెరిగినందుకు సంతోషపడాలో బాధ పడా లో తెలియని పరిస్థితిలో ఉన్నాము. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ గాడ్జెట్స్ కి బానిసలుగా మారిపోతున్నారు. దీనితో పాటు ఆహారం లో భాగం గా జంక్ ఫుడ్ ని తీసుకుంటున్నారు . దీనివల్ల చిన్న వయస్సులోనే పిల్లలు ఊబకాయం తో బాధపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తం గా పిల్లలో ఊబకాయుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ కలవరపరుస్తోంది.
టెక్నాలజీ పెరగడంసంగతిఅటుంచితే. పిల్లలు టీవీలకు, వీడియో గేమ్లకుఅంకితంఅయిపోతున్నరు . టీవీలకు అతుక్కుపోవడమే గాకుండా జంక్ ఫుడ్కు బాగా అలవాటుపడిపోతున్నారు. దీంతో చిన్న వయస్సులోనే పిల్లలు ఊబకాయం బారిన పడుతున్నారు. ప్రపంచంలో బాలల్లో ఊబకాయుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.పిల్లల్లో ఊబకాయం సమస్య వలన పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని పరిశోధకులు అంటున్నారు. అందుకే పిల్లల్లో ఒబెసిటీ పెరగకుండా తగిన చర్యలు అవసరమని వారు సూచిస్తున్నారు. పరిశోధకులు అంచనా ప్రకారం 2025వ సంవత్సరం వచ్చేసరికి 4 మిలియన్ల మంది పిల్లలు టైప్ 2 మధుమేహం వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు .
2025 వ సంవత్సరం నాటికి ప్రపంచంలో 5 నుంచి 17 ఏళ్ల లోపు పిల్లల్లో 26.8 కోట్ల మంది అధిక బరువు తో ఇబ్బంది పడే అవకాశం ఉందని వాషింగ్టన్ పరిశోధకుల అంచనా లో తెలియవచ్చింది. పిల్లల జీవనశైలిలో మార్పులు తీసుకురాకపోతే ఊబకాయుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. కాబట్టి పిల్లలకు టీవీ, ఫోన్ అలవాటు తప్పించండి.. శారీరకం గా అలసిపోయేలా ఆటలు ఆడుకునే లా ప్రోత్సహించండి.. ఆహారం విషయం జాగ్రత్తలు అవసరం.. సరయిన సమయానికి పౌష్ఠిక ఆహారాన్ని అందేలా చేయండి. సమయానికి నిద్రపోవడం..లేవడం వంటి అలవాట్లను నేర్పించండి. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వలన ఊబకాయ సమస్య ఎంతో కొంత తగ్గించుకోవచ్చు..
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?