పిల్లలు సంతోషకరమయిన జీవితం అనుభవించాలంటే తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఆనందంగా ఉండడం చాల అవసరం. కాబట్టి వయ్యస్సు పెరుగుతున్న కొద్దీ, ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. బాధ్యతలు పెరిగే కొద్దీ ఆరోగ్యాన్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. అమెరికా హార్ట్ అసోసియేషన్ తెలియచేసిన ప్రకారం తండ్రులు కొన్ని రకాల అంశాలపై శ్రద్ధ పెట్టకపోవడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి.
అవి గుండె సమస్య లు, కేన్సర్, అనుకోకుండా జరిగే గాయలు, శ్వాస సమస్యలు, షుగరు , సూసైడ్, నిమోనియా, అల్జీమర్స్, కాలేయ సమస్యల ను నిర్లక్ష్యంచేయడం వలన మరింత పెరుగుతాయి. పొట్ట యాపిల్లా ముందుకి వచ్చి ఉండే వారికి షుగర్ ,గుండె పోటు, షుగరు , కేన్సర్, వచ్చే ప్రమాదం ఉంటుంది.
తండ్రులు పాటించాల్సిన ఆరు ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం..ప్రతి రోజూ రాత్రి వేళ 7 నుంచి9 గంటలు ఖచ్చితం గా నిద్రపోవాలి. స్మోకింగ్ వదిలేస్తే… కేన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. శ్వాస సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. వ్యాయామం పై మరింత శ్రద్ధ పెట్టాలి. రోజూ 2 గంటలపాటూ, ఏరోబిక్స్ లాంటివి చేస్తుండాలి. కండరాల్ని మరింత బలంగా చేసుకోవాలి. రోజూ తినే ఆహారం రకరకాల కూరగాయలు, పండ్లు ఉండేలా చేసుకోవాలి.
ఒత్తిడి గా అనిపించినప్పుడు అందరితో మాట్లాడండి, కామెడీ సీన్లు చూడడం ఇలా ఏదో ఒకటి చేసి నవ్వుతూ టెన్షన్లు తగ్గించుకునేందుకుప్రయత్నం చేయాలి. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయిన్చుకుంటూ ఉండాలి. ముఖ్యంగా బీపీ, షుగర్స్థాయిలను గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే అవి ఉండడం వలన గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిల్లలని వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పెద్దవాళ్లుకూడా తగినజాగ్రత్తలు తీసుకోవడం వలన పిల్లలు సంతోషం గా ఉంటారు.. అదే మీరు సంపాదనలో పడి రోగాల పాలైతే మీరు ఎంత డబ్బు ఇచ్చిన పిల్లలు సంతోషం గా ఉండలేరు.