ఇటీవల చైనా పాకిస్థాన్ కు ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న 50 వింగ్ లూంగ్ 2 డ్రోన్లను అమ్మింది. ఈ నెలలో వాటిని పాకిస్తాన్ కు సరఫరా చేయాలని నిర్ణయించినట్లు చైనా అధికారులు మీడియాకు తెలియజేసారు. అంతే కాకుండా ఈ అత్యాధునిక ఆయుధాలను ఎదుర్కొనే సామర్థ్యం భారత్ కు లేదని ఇక భారత సైన్యానికి కాళ రాత్రేనని తెలిపింది. ఈ డ్రోన్ లు టర్కీకి చెందినవి. గతంలో ఇలాంటి డ్రోన్లు లిబియా – సిరియా – అజర్ బైజాన్ ఘర్షణల్లో శత్రువుల రక్షణ వ్యవస్థలను చిత్తు చేశాయని పేర్కొంది.
భారతీయ భూ నిర్మాణం మరియు భారత సాయుధ బలగాలకు ఇటువంటి పెద్ద సంఖ్యలో సాయుధ డ్రోన్ ల దాడిని అణిచివేయగల సత్తా లేదని చైనా పేర్కొంది. అటువంటి శక్తివంతమైన 50 వింగ్ లూంగ్ II సాయుధ డ్రోన్లను పాకిస్తాన్ కు చైనా సరఫరా చేసింది.
అయితే ఈ వ్యాఖ్యలకి భారత సైనిక అధికారులు స్పందిస్తూ సాయుధ డ్రోన్లు నియంత్రణ చేయలేని వాయు ప్రదేశాలలో లేదా వాయు ఆధిపత్యం ఉన్న చోట బాగా పనిచేస్తాయని చెబుతున్నారు. లడఖ్ లోని వాస్తవ నియంత్రణ రేఖ కానీ జమ్మూ కాశ్మీర్ లో నియంత్రణ రేఖ అయినా గగనతలం రాడార్ల ద్వారా ప్రతీక్షణం చాలా నిశితంగా పరిశీలించబడుతుంది. అదేవిధంగా భారత సాయుధ బలగాలు నిత్యం అప్రమత్తంగా ఉంటాయని ఒకవేళ శత్రు దేశాల సాయుధ డ్రోన్లు గీతలు దాటితే కాల్చివేయబడతాయి అని భారత వైమానిక దళం మాజీ చీఫ్ అన్నారు. అది చైనా చెబుతున్నంత తేలిక కాదని ఆయన అంటున్నారు.
చైనా సరిహద్దులోని లఢక్ వాస్తవాధీన రేఖ లేదా పాకిస్థాన్ వైపు ఉన్న నియంత్రణ రేఖ పై భారత రాడార్లు యుద్ధ విమానాల నిఘా ఎల్లప్పుడు ఉంటుందని భారత్ తెలిపింది. అయితే పాకిస్థాన్ ఆయుధ డ్రోన్లను సమకూర్చుకుంటున్నందున భారత్ కూడా సాయుధ డ్రోన్లను మరియు డ్రోన్ల వ్యతిరేక వ్యవస్థలను సిద్ధం చేసుకోవాలిసిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు.