గల్వాన్ లోయలో చైనా – భారతదేశం సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇకపోతే అటువైపు నుండి చైనా ప్రభుత్వం. వారి సైనికులు ఎంత మంది చనిపోయారు అన్న విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు.
భారత ఆర్మీ మాత్రం అటు ఇటుగా ఒక 40 మంది చైనా సైనికులు చనిపోయి ఉంటారని ఊహాగానాలు వ్యక్తం చేసింది. అయితే చైనా దేశ ప్రజలు మాత్రమే ఈ విషయం పై వారి ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అటువైపు భారత్ ఎంత మంది భారత జవాన్లు చైనా వారి చేత చంపబడ్డాడు అని అధికారికంగా వెల్లడించినప్పుడు మీ దగ్గర నుండి ఎటువంటి సమాధానం ఎందుకు లేదు అన్నది వారి ప్రశ్న.
ఇంకా…. దేశ ప్రజలకు సైనికదళాల కు సంబంధించిన సమాచారం ఇవ్వకపోవడం…. ఇంకా ఇటువంటి విషయాలు దాస్తే తమకు రాబోయే రోజుల్లో భద్రతపై భరోసా ఎవరు ఇస్తారని వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా ప్రపంచ దేశాలన్నీ వారితో సంబంధాలు తెంచేసుకుంటుంటే… సొంత దేశంలోనే ఈ రకమైన అసమ్మతి రావడం అనేది వారికి ఏ మాత్రం మంచిది కాదు అనే చెప్పాలి.