కరోనా వ్యాక్సిన్ విషయంలో డ్రాగన్ కంట్రీ ఇండియా ని పొగడ్తల వర్షం తో ముంచెత్తింది. చైనా దేశం వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచం మొత్తం అమ్మాలని చూసిన గాని చాలా దేశాలు తిరస్కరించాయి. ఇలాంటి తరుణంలో నేపాల్ అదేవిధంగా బ్రెజిల్ లాంటి దేశాలు చైనా వ్యాక్సిన్ ని అప్పట్లో తిరస్కరించగా.. ఇప్పుడు ఇండియా వ్యాక్సిన్ కావాలని లెటర్లు రాస్తున్నాయి.
అదే సందర్భంలో భారత్ పెద్ద హడావిడి చేయకుండా వ్యాక్సిన్ ని అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం పంపిణీ కార్యక్రమాలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అంతేకాకుండా ఎగుమతులకు కూడా రంగం సిద్ధం చేసింది. వివిధ దేశాల్లో ఇప్పటికే భారత్ వ్యాక్సిన్ తీసుకోవడం కోసం క్యూ కడుతున్నాయి.
ఇటువంటి తరుణంలో చైనా తరుపున ఉండేటటువంటి వాయిస్ ను మాత్రం పర్ఫెక్ట్ గా వినిపించేటువంటి “గ్లోబల్ టైమ్స్” భారత్ ని అభినందించటం అంతర్జాతీయంగా ఈ వార్త సంచలనం అయ్యింది. శరవేగంగా వ్యాక్సిన్ ని కనుగొని ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావడం నిజంగా గ్రేట్ అని అభివర్ణించింది. మరోపక్క అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ భారత్ మార్కెట్ ని దెబ్బకొట్టాలని ప్రయత్నాలు ఈ “గ్లోబల్ టైమ్స్” చేయటం గమనార్హం.