కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తృతమవుతోంది. ముఖ్యంగా రాజకీయ నేతలు ఈ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్ర ముఖ్యమంత్రులతో సహా పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు కరోనా పాజిటివ్ అని తేలిన విషయం తెల్సిందే. ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా భూతం కోరలు చాస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ప్రకాశం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ అని తేలింది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకి, ఈయన కుమారుడు వెంకటేష్ కి మూడు రోజుల కిందట కరోనా పాజిటివ్ అని ఖరారు అయింది.
వైరస్ లక్షణాలు ఉండడంతో టెస్టులు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. ఇక గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా ఈయన భార్యకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రాంబాబుకు కరోనా పాజిటివ్ సోకింది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?