Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి – కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ మోహన్ రాజాల కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ఘనంగా ప్రారంభం అయింది. ఈ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన లూసీఫర్కి అఫీషియల్ రీమేక్గా తెరకెక్కుతోంది. గత కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మేకర్స్ ప్లాన్ ప్రకారం అయితే ఈపాటికే ఈ రీమేక్ సినిమా దాదాపు సగానికి పైగా షూటింగ్ పూర్తి కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆచార్య పూర్తి కాకపోవడంతో ఈ సినిమా డిలే అయింది.
ఇటీవలే ఆచార్య పూర్తి చేశారు చిరంజీవి. దాంతో మెగాస్టార్ వెంటనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కించారు. తాజాగా షూటింగ్ మొదలైన ఈ మూవీ మొదటిరోజు భారీ యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు మొహన్ రాజా తెరకెక్కించారు. తానే స్వయంగా ఈ చిరు 153 ప్రారంభం అయిందని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇక ఆయన దూకుడు చూస్తుంటే ఈ ఏడాది చివరి వరకు లూసీఫర్ తెలుగు రీమేక్ చిత్రీకరణను పూర్తి చేసేలా ఉన్నారు. త్వరలో ఈ సినిమాలో నటించే హీరోయిన్ సహా ఇతర వివరాలను వెల్లడించనున్నారు.
Chiranjeevi: చిరు – చరణ్ ఇందులో నక్సలైట్స్గా కనిపించబోతున్నారు.
కాగా త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా నటిస్తున్న ఆచార్య సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు. కాజల్ అగర్వాల్ – పూజా హెగ్డే హీరోయిన్స్గా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రాం చరణ్ సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. చిరు – చరణ్ ఇందులో నక్సలైట్స్గా కనిపించబోతున్నారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు, లాహే లాహే సాంగ్ ఆచార్య మీద భారీ అంచనాలను పెంచాయి. మెగా అభిమానులతో పాటు యావత్ తెలుగు సినీ ప్రేమికులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.