మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీస్ బ్యానర్స్ లో రాం చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నాడు. కేద్రం అన్ని చిత్ర పరిశ్రమలకి షూటింగ్స్ జరుపుకోవడానికి అనుమతులివ్వడంతో టాలీవుడ్ లో చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాలవరకు అన్ని షూటింగ్స్ కి షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో ఆచార్య సినిమా గురించి కూడా ఆసక్తికరమైన చర్చలు మొదలైయ్యాయి. ఇప్పటికే రక రకాల కారణాల వల్ల ఈ సినిమా కి చాలా సమయం పట్టింది. ఇక దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకోసం మూడేళ్ళకి పైగానే సమయం కేటాయించాడు. కాగా ప్రభాస్ రాధే శ్యామ్, రాజమౌళి ఆర్ ఆర్ ఆర్, సూపర్ స్టార్ సర్కారు వారి పాట ఇండియా తో పాటు విదేశాలలోను షూటింగ్ కి సమాయాత్తమవుతున్నాయి.
దాంతో కొరటాల కూడా ఆచార్య ని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళాలని పక్కాగా ప్రణాళికలు వేస్తున్నాడట. 40 శాతం టాకీపార్ట్ అండ్ ఒక సాంగ్ కంప్లీటయిన ఆచార్య సినిమాని మెగాస్టార్ లేకుండా ముందు ఇతర ఆర్టిస్టుల తో స్టార్ట్ చేయనున్నారట. ఈ ప్లాన్ వర్కౌట్ అయి షూటింగ్ సజావుగా సాగుతుంటే ఆ తర్వాత మెగాస్టార్ సెట్స్ లోకి అడుగుపెడతారని అంటున్నారు. ఇక ఎటువంటి పరిస్థితుల్లో 2021 సమ్మర్ లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడమే కొరటాల టార్గెట్ అని అంటున్నారు.