మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం.150’ తో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 10 ఏళ్ళ తర్వాత చిరంజీవి వస్తున్నాడని తెలియగానే పెద్ద పెద్ద నిర్మాతలందరు మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమాని నిర్మించాలని క్యూ కట్టారు. ఆ లిస్ట్ లో మెగా ప్రొడ్యూసర్ .. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కూడా ఉన్నారు. కాని మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ అందరికీ షాకిచ్చాడు. నాన్న కోసం నేనే నిర్మాతగా మారతానని ప్రకటించాడు.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అన్న నిర్మాణ సంస్థ ని ప్రారంభించాడు. ఈ నిర్మాణ సంస్థ ను కేవలం నాన్న కోసమే స్థాపించానని నాన్నతోనే సినిమాలు నిర్మిస్తానని వెల్లడించాడు చరణ్. ఆ విధంగానే చిరంజీవితో వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ‘ఖైదీ నెం.150’ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరు 151 గా వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమాని చరణ్ నిర్మించాడు. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు మెగాస్టార్ కి ఈ సినిమా చేయాలన్న కలని నెరవేర్చాడు చరణ్.
తర్వాత ఆచార్య ప్రకటించాడు చరణ్. అయితే సరిగ్గా సినిమా చిత్రీకరణ మొదలయ్యో ముందు కొరటాల శివకు సన్నిహితుడు అయిన నిరంజన్ రెడ్డి మరో నిర్మాతగా ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యాడు. ఇద్దరు కలిసి ఆచార్య కి బడ్జెట్ ని కేటాయించాలనుకున్నారు. కారణలేంటో గాని చరణ్ ఈ సినిమా నిర్మాణం నుండి తప్పుకున్నట్లుగా ప్రచారం జరిగింది. కాగా వెంటనే ఈ వార్తల్లో వాస్తవం లేదని నిరంజన్ రెడ్డి క్లారిటీ ఇస్తూ ఆచార్య ని ఇద్దరం కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు తెలిపాడు.
ఇక తాజాగా మెగా ఫ్యాన్స్ కొత్త డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వరసగా అన్ని పాన్ ఇండియన్ సినిమాలు.. భారీ బడ్జెట్ తో భారీ మల్టీ స్టారర్స్ గా రూపొందుతుండటంతో ఆచార్య లో చరణ్ ని ఎక్కువ సేపు చూడాలని భావిస్తున్నారట అభిమానులు. ఇప్పుడున్న స్క్రిప్ట్ ప్రకారం 25- 30 నిముషాలు మాత్రమే చరణ్ ఆచార్య లో కనిపించబోతున్నాడని ముందు నుంచి చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పుడు ఫుల్ లెంగ్త్ లో కనిపించాలని మెగా ఫ్యాన్స్ కోరుతున్నారని తెలుస్తుంది. నిజంగా మెగాస్టార్ .. మెగా పవర్ స్టార్ సినిమామొత్తం కలిసి కనిపిస్తే మాత్రం కొత్త రికార్డ్స్ ఎన్ని క్రియోటవుతాయో ఊహించడం కష్టం.