కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక రీసెంట్ గా విడుదలైన ‘ఆచార్య’ టైటిల్ మోషన్ పోస్టర్ మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.
అయితే ‘ఆచార్య’ సినిమా మీద కాపీ ఆరోపణలు రావడం కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ కంగారు పడుతున్నట్టు సమాచారం. ఇక ‘ఆచార్య’ సినిమా కోసం కొరటాల శివ దాదాపు సంవత్సానికి పైగానే వెయిట్ చేసాడు. లేటయినా ప్రాజెక్ట్ పట్టాలెక్కిందనుకుంటే సినిమా మొదలైనప్పటి నుంచి ఏదో ఒక సమస్య. ముందు మహేష్ బాబు నటిస్తాడన్న ప్రచారం. మళ్ళీ డ్రాపయ్యాడని కొన్నాళ్ళు చర్చలు.. ఆ తర్వాత హీరోయిన్ కష్టాలు..ఇలా సమస్యలు తలెత్తాయి.
ఆచార్య కోసం ముందు హీరోయిన్ గా త్రిష ని ఫైనల్ చేశారు. కాని స్టాలిన్ ప్రభావం సెంటిమెంట్ గా ఎక్కడ పడుతుందో అని త్రిష ని కాదని కాజల్ ని తీసుకున్నారు. ఆ తర్వాత మహేష్ బాబు పాత్ర లో చేయాలనుకున్న చరణ్ ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగులో బిజీగా ఉండి ‘ఆచార్య’కి డేట్స్ ఇవ్వలేకపోయాడు. ఈ లోపు కరోనా దెబ్బ.. ఈ దెబ్బతో లాక్ డౌన్. చిత్రీకరణ నిలిచిపోయింది.
ఇక రీసెంట్ గా ‘ఆచార్య’ సెట్స్ పైకి ఉండగానే అల్లు అర్జున్ తో తన నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేశాడు. అయితే మోషన్ పోస్టర్ రిలీజ్ కాగానే ‘ఆచార్య’ కథ నాదే అంటూ ఇద్దరు రైటర్స్ నిర్మాణ సంస్థ మీద, దర్శకుడి మీద ఆరోపణలు చేశారు. మెగాస్టార్ కి 60 ప్లస్ ఏజ్ కావడంతో కరోనా ప్రభావం ఎప్పుడు తగ్గుతుందో తెలీక ‘ఆచార్య’ని ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్తారో క్లారిటీ రావడం లేదు. ఇలా ‘ఆచార్య’కి మొదటి నుంచి ఏదొక ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. ఇలా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన సినిమాలు గతంలో ఫ్లాప్స్ గా మిగిలాయి. దాంతో ఇదే ఇప్పుడు ఆచార్య కి జరగనుందా అంటూ మెగా ఫ్యాన్స్ క్లారిటీ ఇవ్వమని కొరటాలని అడుగుతున్నారట.