Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” సినిమా చేస్తూ ఉండగానే మరోపక్క అనేక ప్రాజెక్టులను లైన్లో పెట్టడం తెలిసిందే. “ఆచార్య” షూటింగ్ ఒక పక్క జరుగుతూ ఉండగానే.. ఇండస్ట్రీలో ఏ కుర్ర హీరో ఒప్పుకొని సినిమాలను.. చిరంజీవి ఒప్పుకుంటూ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచారు. “సైరా” సినిమా చేస్తున్న సమయంలో చిరంజీవి.. కొరటాల శివ తో సినిమా చివరిలో ఒప్పుకున్నట్లు వార్తలు మీడియాకి అధికారికంగా ప్రకటించడం జరిగింది. దాదాపు 2019 వ సంవత్సరం చివరిలో “సైరా” రిలీజ్ అవ్వగా.. 2020 ప్రారంభానికి కొద్ది నెలల ముందు “ఆచార్య” సినిమా స్టార్ట్ అయ్యింది.
ఆ తర్వాత వైరస్ ఎంట్రీ ఇవ్వడంతో … షూటింగ్ విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల కారణంగా..లాక్ డౌన్ దెబ్బకు షూటింగ్ మెల్లమెల్లగా మళ్లీ మొదలవుతు.. ప్రస్తుతం ఫైనల్ దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. పరిస్థితి ఇలా ఉండగా బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కి సంబంధించి టైటిల్ వీరయ్య అని పెట్టాలని.. డిసైడ్ అవ్వడం జరిగిందట. చిరంజీవికి కూడా టైటిల్ బాగా నచ్చటంతో.. ఇదే ఫైనల్ టైటిల్ అని.. డిసైడ్ అవుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
Read More: Chiranjeevi : చిరంజీవికి జంటగా సోనాక్షి సిన్హా..!
“ఆచార్య” అయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కరోనా కారణంగా మొన్నటి వరకు షూటింగ్లు నత్తనడకన సాగుతూ ఉండటంతో.. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ అతి తక్కువ టైమ్ లోనే కంప్లీట్ చేసే ఆలోచనలో బాబి డిసైడ్ అయినట్లు అందుకు తగ్గ రీతిలో షెడ్యూల్స్.. పక్కా ప్లానింగ్ తో ఉండేటట్లు.. సినిమా యూనిట్ కి చిరంజీవి ఆదేశాలు ఇచ్చినట్లు టాక్.