Charan : టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ కలిసి “ఆచార్య” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా వరకూ చివరిదశకు చేరుకుంది. ఈ వేసవి కాలంలో సినిమా రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇలాంటి తరుణంలో మరోసారి చరణ్ చిరు కలిసి మల్టీ స్టారర్ సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలలో సరికొత్త టాక్ వినబడుతోంది.
మేటర్ లోకి వెళ్తే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా ఈ సినిమాలో రామ్ చరణ్ నటించబోతున్నట్లు, ఒకే ఒక్కడు సినిమా సీక్వెల్ అన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో ఈ టాప్ డైరెక్టర్ దర్శకత్వంలో ఈ సినిమాలో చిరంజీవి కూడా ఒక కీలక పాత్ర చేస్తున్నట్లు సరికొత్త వార్త ఇప్పుడు ఇండస్ట్రీ లో వైరల్ అవుతుంది.
ఎప్పటినుండో శంకర్ దర్శకత్వంలో నటించాలని చిరంజీవి కోరిక ఉండటంతో …చరణ్ ఏరికోరి మరీ తన తండ్రి కోసం సినిమాలో ఈ పాత్ర ఉండాలని శంకర్ కి సూచించడంతో..ఆయన కూడా ఓకే అన్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం రామ్ చరణ్.. రాజమౌళితో RRR, కొరటాల దర్శకత్వంలో “ఆచార్య” సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమా షూటింగులు ఓ కొలిక్కి వచ్చాక శంకర్ సినిమా కి సంబంధించి అనేక అధికారిక ప్రకటనలు రానున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.