Chiranjeevi: ఇటీవల లోకేష్ కనకరాజు దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన “విక్రమ్” సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వానికి సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీలు సైతం ఫిదా అయిపోయారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా “విక్రమ్” సినిమా యూనిట్ నీ తన ఇంటికి పిలిపించుకుని అభినందించారు. దీనిలో భాగంగా లోకేష్ కనగరాజ్ తో పాటు కమలహాసన్ సినిమా నిర్మాతలు ఇంకా నితిన్ కూడా.. చిరంజీవి ఇచ్చిన పార్టీకి రావడం జరిగింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదే సందర్భంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి ప్రత్యేకంగా కమల్ హాసన్ ని శాలువాతో సత్కరించారు. అనంతరం సల్మాన్ ఖాన్ కి బొకేతో సన్మానించారు. ప్రస్తుతం సల్మాన్ హైదరాబాద్ లో తన కొత్త సినిమా “కబీ ఈద్.. కబీ దివాలి” షూటింగ్ చేస్తున్నారు. ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి తో “గాడ్ ఫాదర్” లో కూడా నటిస్తున్నారు. ఈ క్రమంలో “గాడ్ ఫాదర్” లో.. తన రోల్ మెయిన్.. సన్నివేశాలు ప్రారంభంలో ముంబైలో జరగగా అక్కడ సల్మాన్ పాల్గొనడం జరిగింది.
అయితే ప్రస్తుతం హైదరాబాదులో తన సినిమాతో పాటు చిరంజీవి సినిమాకి సంబంధించి స్పెషల్ సాంగ్ షూట్ లో సల్మాన్ జాయిన్ కానున్నారు. ఏది ఏమైనా ముగ్గురు టాప్ లెజెండ్స్.. నటీనటులు ఒకే చోట కనబడటం సంచలనంగా మారింది. చిరంజీవి ఇంట్లో “విక్రమ్” సినిమా యూనిట్ కి ఇచ్చిన పార్టీలో..యాంగ్ హీరోలు అక్కినేని అఖిల్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ కూడా పాల్గొనడం జరిగింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?