Chiranjeevi: నిన్నమొన్నటిదాకా కరోనా కష్ట కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న సినిమా హీరోల లో … ఇతరులకు సాయం చేసే వార్తలకు సంబంధించి ఒక్క సోను సూద్ పేరు మాత్రమే దేశవ్యాప్తంగా గట్టిగా కనబడేది. కానీ గత కొన్ని రోజుల నుండి టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి పేరు రోజురోజుకి డబల్.. త్రిబుల్ గా వినబడుతోంది. మేటర్ లోకి వెళ్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా బారినపడిన పేషెంట్లకు ఆక్సిజన్ విషయంలో ప్రతి జిల్లాలో ఆసియన్ ప్లాంట్లు చిరంజీవి ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. వారం రోజుల్లో ఈ ఆక్సిజన్ ప్లాంట్ లు అందరికీ అందుబాటులో ఉంటాయని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
ఇదే తరుణంలో సీనియర్ నటి శ్యామల కనీసం లేని పరిస్థితి ఉండటంతో మాత్రమేకాక ఇంటి అద్దె కూడా తట్టుకోలేక అనారోగ్యానికి మందులు కనుక్కోలేక ఉన్న తరుణంలో శ్యామల ఇంటి ఖర్చులు వైద్యం నిమిత్తం చిరంజీవి లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే రీతిలో ప్రముఖ జర్నలిస్టు టి ఎన్ ఆర్ కుటుంబానికి కూడా లక్ష రూపాయలు అందజేశారు. ఈ రీతిగా చాలా మందికి సహాయం చేస్తూ వస్తున్న చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్ విలన్ అనిపించుకున్న… పొన్నాంబళం ఇటీవల కిడ్నీ ఫెయిల్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆ సమయంలో తనని ఆదుకోవాలని ఆపరేషన్ కి ఖర్చు నిమిత్తం చాలా మందిని హెల్ప్ అడుగుతా సోషల్ మీడియాలో వీడియో కూడా రావడం జరిగింది.
అయితే తాజాగా ఈ విలన్ కిడ్నీ కి సంబంధించిన ఆపరేషన్ నిమిత్తం చిరంజీవి 2,00,000 డొనేట్ చేయడం జరిగిందట. కారవన్ డ్రైవర్ కిలారి జయరామ్ ఇటీవల మహమ్మారి కరోనా పోరాడి మరణించడంతో ఆ కుటుంబానికి కూడా లక్ష రూపాయలు చిరంజీవి సాయం చేసినట్లు సమాచారం. జంతువులు చాలా వరకు ఇండస్ట్రీలో ఉన్న వారిని ఆదుకోవడం కోసం చిరంజీవి భారీగా చేస్తున్న సహాయం.. అట్లా చిరంజీవిని టాలీవుడ్ ఇండస్ట్రీ సోనూసూద్ అంటూ… నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మెగా అభిమానులు అయితే… అన్నా ఆపద్బాంధవుడు అంటు.. కష్టం అంటే చాలు…ఆ ఇబ్బంది తొలగించడానికి, తీర్చడానికి ముందుంటాడు. ఈరితీగ ఇటీవల మెగాస్టార్ వరుసగా చాలామందికి హెల్ప్ చేయడం పట్ల సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది.