మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లూసీఫర్. ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి తెలుగులో రీమేక్ చేబోతున్నారు. ఈ క్రమంలో లూసీఫర్ తెలుగు రీమేక్ కి తాజాగా దర్శకుడిని ఫిక్స్ చేశారు చిత్ర బృందం. ముందు ఈ సినిమాకి దర్శకత్వం బాధ్యతలు సాహో ఫేం సుజీత్ తీసుకున్నాడు. సిజీత్ స్క్రిప్ట్ చిరంజీవికి నచ్చకపోవడం తో ఆ తర్వాత ఆ ప్లేస్ లో వి వి వినాయక్ వచ్చి చేరాడు. కాని వినాయక్ కూడా చిరంజీవి ని మెప్పించలేకపోవడంతో ఇప్పుడు ఈ సినిమా తెలుగు రీమేక్ బాధ్యతలు తమిళ దర్శకుడు మోహన్ రాజా కి అప్పగించారు.
గత కొన్ని రోజులుగా వినాయక్ తపుకున్న ఈ ప్రాజెక్ట్ లోకి మోహన్ రాజా వచ్చి చేరాడని.. స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. కాని చిత్ర బృందం అధికారకంగా ఏ విషయాన్ని వెల్లడించలేదు. దాంతో ఇక ఈ సినిమా ఉండదన్న రూమర్స్ కూడా వినిపించాయి. కాగా ఎట్టకేలకి తనిఒరువన్ (ధృవ) ఫేం మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు అధికారకంగా వెల్లడించారు చిరంజీవి. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. కొరటాల శివ ఈ సినిమాని శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.
కాగా లూసీఫర్ తెలుగు రీమేక్ ని జనవరి 2021 సంక్రాంతి తర్వాత సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం అవుతోందని తాజా ప్రకటనలో వెల్లడించారు. జనవరి లో ఈ సినిమాని మొదలు పెట్టి ఏప్రిల్ వరకు టాకీపార్ట్ ని కంప్లీట్ చేయనున్నారు. ఇక ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాం చరణ్ తో పాటు ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే విజయదశమి పండుగ సందర్భంగా లూసీఫర్ తెలుగు రీమేక్ ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇక ఆచార్య, లూసీఫర్ సినిమాల తర్వాత వేదాలం రీమేక్ లో నటించబోతున్నారు చిరంజీవి.