టాలీవుడ్లో మురళీ మోహన్ (Murali Mohan)కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పొచ్చు. ఈ సినీ స్టార్ అటు హీరో గానూ, ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ తెలుగు చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ ప్రయాణం చేసారు. 1970-1980 కాలంలో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు హవా లోనూ మురళీమోహన్ బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించారు. నిర్మాతగా కూడా పాలు ప్రతిష్టాత్మక చిత్రాలు నిర్మించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ నటిస్తున్న గాడ్ ఫాదర్ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించనున్నారు. అయితే ఈ మూవీలో నటించాలంటూ మెగాస్టారే స్వయంగా తనకు ఫోన్ చేశారని ఈ సీనియర్ నటుడు ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.
మోహన్కు చిరు షాక్
మెగాస్టార్ చిరంజీవి తనకు ఫోన్ చేసి.. “తెల్ల వెంట్రుకలతో ఉన్న మీ ఫొటోను పంపండి” అని అడిగాడని మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దాంతో తాను షాక్ అయ్యాను అని అన్నారు. అతని నుంచి ఫోన్ రావడమే ఒక షాకింగ్ విషయం. మళ్లీ తెల్ల వెంట్రుకలు గల ఫొటో కావాలి అనేసరికి నేనింకా షాక్ అయ్యానన్నట్లు మురళీ తెలిపాడు. ఆ తర్వాత ఎందుకని అడిగితే ఈ ఫొటోలను డైరెక్టర్ మోహన్ రాజా చూస్తారని.. త్వరగా పంపించాలని కోరినట్లు వెల్లడించాడు. “మా నాన్నా మరణించినప్పుడు తెల్ల వెంట్రుకలు, తెల్ల గడ్డంతో ఉన్నాను. చిరంజీవి ఆ అవతారంలో ఉన్న నా ఫొటోలు పంపించమన్నాడు. నేను సరైనని అవే ఫొటోలు పంపించాను. ఆ తర్వాత వాటిని డైరెక్టర్ మోహన్ చూసి.. ఆ లుక్ తనకు బాగా నచ్చిందని చెప్పారు” అని సీనియర్ నటుడు అన్నారు.
మళ్లీ స్కిన్పై సందడి
గతంలో మురళీమోహన్, చిరంజీవి కలిసి నటించిన మనవూరి పాండవులు, గ్యాంగ్ లీడర్, యుద్ధ భూమి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. మళ్లీ ఇప్పుడు వారిద్దరూ స్క్రీన్పై సందడి చేయనున్నారు. మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్కు రీమేక్గా గాడ్ ఫాదర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన నయనతార నటిస్తుండగా మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.