మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా తన లుక్స్ తో అందరినీ ఆకట్టుకున్న విషయం తెల్సిందే. సోషల్ మీడియాలో చిరంజీవి వచ్చినప్పటి నుండి హల్చల్ మాములుగా లేదు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ చిరు అభిమానులను ఉత్సాహపరుస్తున్నాడు. అలాగే లేటెస్ట్ గా తన ఫోటోషూట్ తో కూడా అలరించాడు మెగాస్టార్.
కానీ ఇప్పుడు తన రీసెంట్ లుక్ తో పెద్ద షాకే ఇచ్చాడు చిరంజీవి. గుండుతో ఉన్న ఫోటోను పోస్ట్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేసాడు. ఇన్స్టాగ్రామ్ లో ఈ ఫోటోను షేర్ చేసాడు. “నేను సన్యాసిలా ఆలోచించగలనా” అని ఆ ఫొటోకు క్యాప్షన్ ను జత చేసాడు. అయితే ఈ లుక్ సినిమా కోసమా, మరేంటన్నది ఇంకా తెలియలేదు. చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. కొరటాల శివ దీనికి దర్శకుడు.