తెలుగు సినీ ఇండస్ట్రీ లో కలెక్షన్ కింగ్ గా పేరు పొందిన డాక్టర్ మోహన్ బాబు కథానాయకుడిగా భారీ అంచనాలతో తెరకెక్కుతున్న చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. ఈ సినిమాకు మాటల రచయిత డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఇది దేశభక్తి నేపధ్యం లో సాగే సినిమా. ఈ సినిమాను మోహన్ బాబు తన సొంత బ్యానర్ అయిన లక్ష్మీప్రసన్న ఫిలిమ్స్ అండ్ 24ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
చాలా సంవత్సరాల తర్వాత మోహన్ బాబు కథానాయకుడిగా చేస్తున్న ఓ పవర్ ఫుల్ రోల్ ఇది. ఇంతవరకు ఇటువంటి పాత్రను మోహన్ బాబు పోషించలేదు. అయితే ఇటువంటి దేశభక్తికి సంబంధించిన సినిమా గాని కథ కానీ ఇప్పటివరకు తెలుగులో రాలేదని చిత్ర యూనిట్ చెబుతోంది.
ప్రస్తుతం శరవేగంగా సన్ ఆఫ్ ఇండియా షూటింగ్ సాగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన రెండవ షెడ్యూల్ షూట్ ను ఇటీవల హైదరాబాద్లో ప్రారంభించారు. తాజాగా ఆచార్య సెట్ లో మోహన్ బాబు కనిపించారట. ఆయన చిరుతో మాట్లాడినట్లు సమాచారం. ఈ చర్య వెనుక పెద్ద కారణమే ఉంది.
మెగాస్టార్ చిరంజీవి మరియు మోహన్ బాబు మొదటి నుండి మంచి స్నేహితులు. అయితే ఆ స్నేహంతోనే మోహన్ బాబు చిరంజీవిని తన సినిమాకు గాత్రదానం చేయాలని అడగగా అందుకు మెగాస్టార్ కూడా సంతోషంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈ సినిమాలోని ఇంట్రడక్షన్ సీన్లకు మెగాస్టార్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక గాత్రదానం చేయడం మెగాస్టార్ కి ఇదేం కొత్త కాదు. గతంలో ఆయన గుంటూరోడు మరియు ఘాజీ సినిమాలకు వాయిస్ ఓవర్ అందించారు. ఇక ఇప్పుడు తన స్నేహితుడి సినిమాకు అందించనున్నారట.