కరోనా ఎఫెక్ట్ తో టాలీవుడ్ ఇండస్ట్రీ చతికిలపడింది. ఈ ఏడాది ఎలాంటి రాబడి లేకపోవడంతో సినీ పెద్దలు సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తో భేటీ అవడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీని ఆదుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాడానికి చిరంజీవితో పాటూ నాగార్జున మరి కొంతమంది పెద్దలు త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతున్నట్లు, ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇంకా అనేక అంశాలను జగన్ దృష్టికి తీసుకురాబోతున్నారు అనే టాక్ వస్తోంది.
అంతేకాకుండా కరోనా నేపథ్యంలో ఇండస్ట్రీ ఏ విధంగా నష్టపోయింది అనే అంశాలకు సంబంధించి ఓ నివేదిక కూడా వైయస్ జగన్ కి ఇండస్ట్రీ పెద్దల ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సో దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుండి రాయితీలను పొందాలన్నే ప్లాన్ సినిమా పెద్దలు వేసిన్నట్లు సమాచారం. మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టూరిజం తరహాలో వైజాగ్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలో జగన్ నుండటంతో సినిమా పరిశ్రమ ని కూడా రాష్ట్రంలోకి ఆహ్వానించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఎప్పటినుండో టాక్ వస్తోంది.
కాగా తాజాగా కరోనా వల్ల నష్టపోవడంతో సినీ పరిశ్రమ పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి జగన్ తో మంతనాలు జరిపే క్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా గతంలో కరోనా లాక్ డౌన్ తర్వాత షూటింగ్ కి సంబంధించిన అనుమతుల కోసం ఒకసారి చిరంజీవి ఆధ్వర్యంలో సినిమా ఇండస్ట్రీ పెద్దలు రావటం జరిగింది. కాగా మరోసారి రాయితీల గురించి జగన్ ప్రభుత్వం తో చర్చించడం కోసం సినీ ఇండస్ట్రీ పెద్దలు రెడీ అవ్వడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఈ వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రానున్నట్లు టాక్ వస్తోంది.