Chiranjeevi – Ram charan: మరో మెగా మల్టీస్టారర్ తెరకెక్కించేందుకు రంగం సిద్దం అవుతుందా..ప్రస్తుతం అవుననే టాక్ ఫిలిం సర్కిల్స్లో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి ఆచార్య సినిమాలో నటించారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్గా నటించారు. సంగీత, రెజీనా స్పెషల్ సాంగ్స్లో సందడి చేయనున్నారు. వాస్తవంగా ఈ సినిమాలో ముందు మహేశ్ బాబు నటిస్తారని ప్రచారం జరిగింది. కానీ బడ్జెట్ పెరుగుతుందనే కారణంగా మహేశ్ కాకుండా ప్రాజెక్ట్లోకి చరణ్ వచ్చి చేరాడు.
దాంతో ఈ సినిమా మెగా మల్టీస్టారర్గా మారింది. ఇక కొరటాల ముందు ఆచార్యలో చరణ్ పాత్ర 20 నుంచి 25 నిమిషాలు మాత్రమే ఉంటుందని చెప్పుకొచ్చారు. కానీ, అదే పాత్రను ఇంకాస్త డెవలప్ చేసి దాదాపు గంటసేపు ఉండేలా మార్పులు చేర్పులి చేశారు. దాంతో ఆచార్య సినిమా భారీ మల్టీస్టారర్గా మారింది. ఎప్పటి నుంచో చిరు – చరణ్లను డైరెక్ట్ చేయాలని చాలామంది దర్శకులు వేచిచూస్తున్నారు. కానీ, ఆ అవకాశం కొరటాలకి మాత్రమే దక్కింది. అయితే అదే అవకాశం మరో సెన్సేషనల్ డైరెక్టర్కు దక్కినట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
Chiranjeevi – Ram charan: మెగాస్టార్ – మెగా పవర్ స్టార్లకు పర్ఫెక్ట్గా సరిపోయే కథ..!
ఆ దర్శకుడే కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఈ దర్శకుడు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్తో సలార్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆ తర్వాత ఎన్.టి.ఆర్ హీరోగా ఓ ప్రాజెక్ట్ ఉండబోతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. దీని తర్వాత డీవీవీ దానయ్య నిర్మాణంలో మెగా మల్టీస్టారర్ తెరకెక్కే అవకాశాలున్నాయట. ఇది కేజీఎఫ్ మాదిరిగా సీక్వెల్ కథ అని సమాచారం. మెగాస్టార్ – మెగా పవర్ స్టార్లకు పర్ఫెక్ట్గా సరిపోయే కథను కూడా ఇప్పటికే చరణ్కు లైన్ రూపంలో వినిపించినట్టు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత నిర్మాత దానయ్య ఈ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి.