Ys Jagan: కరోనా కష్టకాలంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి చాలా సమస్యలు దగ్గరుండి చిరంజీవి బాధ్యత తీసుకుని మరీ కీలకంగా వ్యవహరించారు. గత ఏడాది లాక్ డౌన్ నాటినుండి తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆధారం చేసుకుని బతుకుతున్న సినీ కార్మికులకు చాలా రకాలుగా చిరంజీవి అండ్ టీం ఇంకా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది స్టార్ హీరోలు పెద్దలు ఆదుకుంటూ వస్తున్నారు.
నిత్యావసరాల వస్తువులు అందించటం.. అదే రీతిలో కరోనా వ్యాక్సిన్ లు ప్రతి ఒక్కరికి ఉచితంగా పంపిణీ అయ్యేలా కరోనా క్రైసిస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవాకార్యక్రమాలు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి.. చిరంజీవి దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో కరోనా కారణంగా సరిగ్గా సమ్మర్ లో మంచి బిజినెస్ టైంలో థియేటర్లు చాలావరకు క్లోజ్ అయిపోవడంతో… ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో సామాన్య స్థితికి చేరుతుండటంతో.. ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ ప్రొడ్యూసర్లు అందరితో కలిసికట్టుగా టికెట్ల రేట్లు విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించడానికి చిరంజీవి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
Read more: Chiranjeevi: ఫాదర్స్ డే..! చిరంజీవి, రామ్ చరణ్ స్పెషల్ లుక్.. అదుర్స్
ఈ నేపథ్యంలో ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ అయ్యి టికెట్ల రేట్లు పెంపు విషయంలో డిస్కషన్ చేయాలి అని అనుకుంటున్నారట. ఇండస్ట్రీ లో ఉండే ప్రముఖ ప్రొడ్యూసర్ల తో పాటు సీనియర్ యాక్టర్ లతో కూడా… చిరంజీవి .. సీఎం వైఎస్ జగన్ ని కలిసి.. టికెట్ల రేటు విషయంలో ఉన్న సమస్యలు తొలగించాలి అని.. విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే చాలా వరకు సీఎం జగన్ టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి అదే రీతిలో చిరంజీవి ఇప్పటివరకు తన దృష్టికి తీసుకు వచ్చిన చాలా సమస్యలను పరిష్కరించడం జరిగింది. మరి టికెట్ల రేట్లు పెంపు విషయంలో కూడా చిరంజీవి అండ్ టీం ప్రతిపాదించే అంశాలకు సీఎం జగన్ ఈ సారి ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?