చిరంజీవి రీమేక్ సినిమాల విషయంలో పక్కా క్లారిటీ వచ్చిందని లేటెస్ట్ న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ chiranjeevi కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మాట్నీ మూవీస్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి – రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. దర్శకుడు koratala siva ఆచార్య సినిమాలో రామ్ చరణ్ పాత్ర ని 1 గంట సేపు ఉండేలా డెవలప్ చేశారట. ఈ సినిమాలో చరణ్ ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపిస్తాడని ప్రచారం జరుగుతుండగా తాజాగా aachaarya సెట్ లో చరణ్ అడుగు పెట్టాడు. ఇక ఈ సినిమాలో చరణ్ సిద్ద అన్న పాత్రలో కనిపించబోతున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత chiranjeevi మరో రెండు సినిమాలని లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆచార్య సినిమా డిలే అవడం తో ఈ రీమేక్ సినిమాల విషయంలో క్లారిటీ రావడం లేదు. ఎప్పుడు మొదలవుతాయో అని మెగా ఫ్యాన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా ఎట్టకేలకి ఈ రీమేక్ సినిమాలు ఎప్పుడు సెట్స్ మీదకి రాబోతున్నాయో క్లారిటీ వచ్చిందని తెలుస్తోది. మళయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ తో పాటు తమిళ్ హిట్ సినిమా ‘వేదళమ్’ ను chiranjeevi రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే.
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ‘లూసిఫర్’ తెలుగు వెర్షన్ కి తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ – ఎన్వీఆర్ సినిమా బ్యానర్స్ పై ram charan – ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదలమ్’ సినిమాని చిరంజీవి తెలుగులో చేస్తున్నారు. ‘లూసిఫర్’ రీమేక్ ని జనవరి 21న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారని సమాచారం. అంతేకాదు ‘వేదళమ్’ తెలుగు రీమేక్ ని ఫిబ్రవరిలో పట్టాలెక్కించి.. ‘లూసిఫర్’తో పాటు సమాంతరంగా చిత్రీకరణ జరపాలని chiranjeevi ప్లాన్ చేస్తున్నారట. ఇక అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ ఏడాది 3 సినిమాలని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.