Pakka Commercial: గీత ఆర్ట్స్ బ్యానర్ పై గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంఆర్ట్స్ “పక్కా కమర్షియల్” ప్రీరిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి ఈ సినిమా గురించి ఇంకా గోపీచంద్ అనేకమంది నటీనటుల గురించి మాట్లాడి.. రావు రమేష్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు రావు రమేష్ తో సినిమా చేయలేదు అని అన్నారు. మా మావయ్య అల్లు రామలింగయ్య, రావు రమేష్ తండ్రి రామ్ గోపాల్ రావు ఇద్దరు అన్నదమ్ములు. దీంతోరావుగోపాల్ గారిని చిన్నమావయ్య అని పిలిచే వాడిని.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
వాళ్ళ కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన కూడా నాపై చాలా ఆప్యాయమైన ప్రేమ చూపించే వాళ్ళు. ఈ క్రమంలో ఆయనతో సినిమాలు చేస్తున్న టైంలో మధ్యాహ్నం భోజనానికి ఇంటినుండి ప్రత్యేకమైన క్యారేజ్ నాకు తెప్పించేవారు. క్యారేజ్ లో ఒకసారి వంకాయ కూర ఉంటే నేను తినలేదు. దీంతో రావు గోపాల్ రావు గారు ఏంటయ్యా ఆ వంకాయ కూర ఎందుకు తినలేదు. అది చూడు ఎలా ఉందో శ్రీదేవి బుగ్గల లేదు. వెంటనే కొరికి తినేయాలి. మాకేమో వయస్సు అయిపోయింది. మీరు వయసులో ఉన్నారు ఆలోచించకూడదు అని చాలా చమత్కారంగా మాట్లాడేవారు.
ఇంకా కోడి తొడలు తీసుకొస్తే కూడా చాలా.. డైలాగులు హాస్యాస్పదంగా వేసేవారు. అప్పట్లో ఆయనతో చాలా సరదాగా ఉండేది. అయితే రావు రమేష్ మాత్రం ఇప్పటివరకు నాతో సినిమా చేయలేదు. ఎప్పుడు చేస్తావు అంటూ వేదికపై రావు రమేష్ పై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక రావు రమేష్ టైమింగ్.. లేదా ఆయన పెర్ఫార్మెన్స్ ఈ మధ్య అదరగొట్టేసింది. కచ్చితంగా ఇండస్ట్రీలో రావుగోపాల్ .. గారి లేని లోటును రావురమేష్ తీరుస్తున్నాడు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు..అంటూ చిరంజీవి తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చారు.