Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది సీనియర్ హీరోలు అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ లు ఇటీవల అందిస్తున్నారు. ఒకానొక సమయంలో అభిమానులు హీరోల సినిమాలకు హడావిడి చేస్తూ వారి విజయాన్ని తమ విజయంగా భావిస్తూ సెలబ్రేషన్స్ మీద సెలబ్రేషన్స్ చేస్తూ ఉండేవారు. అభిమాన హీరోల బర్త్ డే లకు .. సినిమా రిలీజ్ అయ్యే రోజు థియేటర్ల దగ్గర హడావిడికి .. అభిమానులు తమ సొంత డబ్బులతో రచ్చ రచ్చ చేసేవాళ్ళు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ వచ్చాక పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారిపోయాయి. అంతకుముందు తమ కెరీర్ కి అండగా ఉన్న అభిమానులకు ఇప్పుడు హీరోలు భుజం కాస్తున్నారు.
ఈ విషయం లో అందరికన్నా టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలు ముందున్నారు. నటసింహం బాలయ్య బాబు .. అభిమానులు మరణ పడకపై ఉన్న సమయంలో అదేవిధంగా అనేక రోగాలతో ..బాధపడుతూ కరోనాతో తల్లిదండ్రులు కోల్పోయిన అభిమానులకు .. బాలయ్య ఫోన్ చేసి వారికి అండగా నిలబడుతున్నారు. కష్టాల్లో ఉన్న అభిమానులకు బాలయ్య ధైర్యం చెబుతున్నారు. ఇప్పుడు ఇదే రీతిలో మెగాస్టార్ చిరంజీవి కూడా రెడీ అయ్యారు.
Read More: Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి స్పెషల్ థాంక్స్ చెప్పిన నాగబాబు..!!
కరోనా కష్టకాలంలో ఇండస్ట్రీ కార్మికులను అదే రీతిలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అనేక రీతులుగా సహాయం చేసిన చిరంజీవి ఇటీవల అమలాపురం లో శ్రీధర్ అనే అభిమానికి ఫోన్ చేసి సడన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. విషయంలోకి వెళితే ఇటీవల చిరంజీవి అందుబాటులోకి తెచ్చిన ఆక్సిజన్ బ్యాంకుల విషయంలో శ్రీధర్ కూడా సహాయపడటం మాత్రమే కాక తొంభై కుటుంబాలను ఆదుకునే రీతిలో స్వయంగా తన సొంత డబ్బులతో ఆక్సిజన్ సిలిండర్లు సప్లై చేయటంతో తన అభిమాని శ్రీధర్ చేసిన పనికి చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి మరీ అభినందించారు. కరోనా పరిస్థితి పూర్తిగా తగ్గిపోయాక హైదరాబాదులో తన ఇంటికి రావాలని చిరంజీవి ఆహ్వానించారు. అభిమాన హీరో చిరంజీవి ఫోన్ చేయటంతో శ్రీధర్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.