కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ సమయం నుండి తెలంగాణలో సినిమా ధియేటర్లు క్లోజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం 50 శాతం సిట్టింగ్ విధానంతో సినిమా థియేటర్ల ఓపెనింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సినిమా థియేటర్ కి వచ్చే ప్రతి ఒక్కరు మాస్క్ లు శానిటైజర్ లు కంపల్సరిగా వాడాలని సూచించింది.
అంతేకాకుండా థియేటర్ లో ఉష్ణోగ్రతలు 24 నుండి 30 డిగ్రీల వరకు ఉండేలా యాజమాన్యాలు చూసుకోవాలని సూచించింది. ఇదే క్రమంలో సినిమా ధియేటర్ టికెట్ల రేట్లు పూర్తిగా యాజమాన్యానికి పెంచుకునే విధంగా అవకాశాలను కేసీఆర్ సర్కార్ వదిలేసింది. దీంతో సినిమారంగానికి ఈ విధంగా మేలు చేయటంతో ట్విట్టర్ ద్వారా చిరంజీవి కేసిఆర్ కి థాంక్స్ తెలిపారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని సినిమా పరిశ్రమకు ఎంతో తోడ్పాటు ఇస్తోందని, కేసీఆర్ తన విజన్ కి తగ్గట్టుగా సినిమా పరిశ్రమకు మేలు చేస్తున్నారని తెలిపారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో దేశంలోనే తెలుగు సినీ పరిశ్రమ మొదటి స్థానం లోకి వెళ్ళటం గ్యారెంటీ అని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. జిఎస్టి, రియంబర్స్మెంట్, విద్యుత్ ఛార్జీల రద్దు వంటివి మంచి నిర్ణయాలు అని అన్నారు. సినిమా ధియేటర్ లో షోలు పెంచుకునేందుకు అనుమతులు సరైన నిర్ణయమని చిరంజీవి..సినిమా టికెట్ విషయంలో పూర్తి హక్కులు సినిమా ధియేటర్ యాజమాన్యాలకి ఇలాంటి సమయంలో కేసీఆర్ సర్కార్ ఇవ్వటం శుభపరిణామం అని చెప్పుకొచ్చారు.