Chiranjeevi: పెళ్లిసందD ప్రీ రిలీజ్ వేడుకకు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. శ్రీకాంత్ కొడుకు రోషన్… శ్రీల జంటగా నటించిన ఈ సినిమా… అక్టోబర్ 15వ తారీఖున రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి తో పాటు విక్టరీ వెంకటేష్ వచ్చారు. చిరంజీవి మాట్లాడుతూ వెంకటేష్ తో… తనకి ప్రత్యేకమైన ఆత్మీయ అనుబంధం ఉందని తెలియజేశారు. అంతే కాకుండా తన సినిమా హిట్ అయితే వెంకటేష్ అభినందిస్తారు అని అదే రీతిలో వెంకటేష్ సినిమా… విజయం సాధిస్తే ఏం చేసావ్ అయ్యా వెంకీ అని అభినందిస్తాను.. అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో ఎప్పుడు ఇటువంటి వాతావరణం ఉండాలని తెలియజేశారు.
చిరంజీవి అసహనానికి లోనయ్యారు
కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే చాలా ఆవేదన కలుగుతుంది అని పేర్కొన్నారు. కొంతమంది పదవుల కోసం అందరికీ లోకువ అయ్యేలా వ్యవహరిస్తున్నారని… ఒకరిని అనటం లేదు అనిపించుకోవటం మనకు అవసరమా అంటూ.. వేదికపై చిరంజీవి అసహనానికి లోనయ్యారు. ఈ తమిళంలో తాను ఏ ఒక్కరిని వేలెత్తి చూపించడం లేదని.. ప్రతి ఒక్కరు విజ్ఞతతో వ్యవహరించాలని తన అభిమతమని స్పష్టం చేశారు.
కించపరచాల్సినా అవసరం లేదు
ఇండస్ట్రీలో ఆధిపత్య చూపించుకోవడానికి ఎదుటివారిని… కించపరచాల్సినా అవసరం లేదని… పేర్కొన్నారు. అసలు ఇండస్ట్రీలో ఎక్కడ వివాదం స్టార్ట్ అయింది అందరూ తెలుసుకోవాలని, ఆ వివాదం ప్రారంభించిన వ్యక్తిని గుర్తించాలని కోరారు. హోమియోపతి వైద్య చికిత్స విధానంలో మూల కారణాన్ని బట్టి చికిత్స చేస్తారు అని… ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో వివాదాలకు అసలు మూలసూత్రం ఎవరు అనేదాన్ని గుర్తించాలని అదే సూత్రం ఇక్కడ వర్తింపజేయాలని.. చిన్నచిన్న గొడవలకు మీడియా ముందుకు వెళ్లి అనవసరంగా లోకో కాకూడదని వేరే వాళ్లకు అవకాశం ఇవ్వద్దని చిరంజీవి వేడుకున్నారు. “మా”అధ్యక్ష ఎన్నికల ఫలితం అనంతరం ఈ ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి.