మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “ఆచార్య” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. మొదలు పెట్టిన నాటి నుండి అనేక బ్రేకులు పడుతూ వస్తున్నాయి. “భరత్ అనే నేను” సినిమాతో విజయం సాధించి దాదాపు కొన్నాళ్లపాటు వెయిట్ చేసి చిరంజీవితో కొరటాల “ఆచార్య” సినిమా స్టార్ట్ చేయడం జరిగింది.
పక్క ప్లానింగ్ వేసుకొని సినిమా ప్రారంభించి దాదాపు 40 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకొని తరుణంలో కరోనా మహమ్మారి రావటంతో మొన్నటి వరకు షూటింగ్ ఆగిపోయింది. ఇటీవల మళ్లీ మొదలు కావడంతో త్వరగా కంప్లీట్ చేసే ఆలోచనలో డైరెక్టర్ కొరటాల అదేవిధంగా సినిమా యూనిట్ వుంది. ఇదిలా ఉంటే నెక్స్ట్ చిరంజీవి వేదాళం సినిమా రీమేక్ చేస్తారని మొన్నటి వరకు వార్తలు రాగా వాటిని పక్కనపెట్టి తాజాగా లూసిఫర్ సినిమాని రీమేక్ చేయటానికి చిరంజీవి రెడీ అయినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల లో టాక్ నడుస్తుంది.
మొదటిలో ఈ సినిమాని సాహో సినిమా డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తారని అందరి అనుకోక తాజాగా రీమేక్ కింగ్ మోహన్ రాజా దర్శకత్వం వహించడానికి రెడీ అయినట్లు సమాచారం. కాగా ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. సో మొత్తం మీద చూసుకుంటే ఆచార్య సినిమా తర్వాత చిరంజీవి చేసే సినిమా లూసీఫర్ అని అంటున్నారు.