మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మలయాళం “లూసిఫర్” రీమేక్ చేయబోతున్నారు. మోహన్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల స్టార్ట్ అయ్యాయి.
ఇక ఈ సినిమా తర్వాత “వేదాళం” రీమేక్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. మరోపక్క కుర్ర డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ సినిమా చేయనున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. కాగా చిరంజీవి తో చేస్తున్న ఈ నలుగురు డైరెక్టర్స్ కొరటాల శివ, మెహర్ రమేష్, మోహన్ రాజా, బాబీలు రీసెంట్గా గ్రూప్ ఫోటో దిగారు.
ఈ ఫొటోని చిరంజీవి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..నా 4 కెప్టెన్స్..నెక్స్ట్ ఫెంటాస్టిక్ 4 వీళ్ళే అంటూ కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెగా అభిమానులు ఫోటో చూసి సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా కి సంబంధించిన టీజర్ జనవరి 26 వ తారీకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేసే ఆలోచన సినిమా యూనిట్ చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంమీద చూసుకుంటే చిరంజీవి రాబోయే రెండు సంవత్సరాలు ఫుల్ ప్రాజెక్ట్స్ తో బిజీ కానున్నట్లు తెలుస్తోంది.