Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ఖైదీ నెంబర్ 150 సినిమా తో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా రీమేక్ సినిమాలను నమ్ము కుంటూ చిరంజీవి సినిమాలను ఓకే చేస్తున్నారు. “ఆచార్య” మినహా తర్వాత చేయబోయే రెండు సినిమాలు.. రీమేక్ కథలు. లూసిఫర్, వేదాళం అనే సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి మరో రీమేక్ స్టోరీకి ఓకే చెప్పినట్లు అదికూడా ఒక స్టార్ డైరెక్టర్ ఆ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. విషయంలోకి వెళితే ప్రముఖ దర్శకుడు ప్రభుదేవా దర్శకత్వంలో.. చిరంజీవి సినిమా చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.
ప్రభుదేవా దర్శకత్వంలో చిరంజీవి గతంలో “శంకర్ దాదా జిందాబాద్” అనే సినిమా చేయడం జరిగింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా పడింది. ఆ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి రావడం.. అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక మళ్లీ ప్రభుదేవాతో చిరంజీవి సినిమా చేయడానికి రెడీ అవ్వడం సంచలనంగా మారింది. ప్రభుదేవాకి రీమేక్ స్పెషలిస్ట్ గా పేరు ఉంది. ఈ నేపథ్యంలో చిరంజీవి ప్రభుదేవాతో ఎటువంటి సినిమాని రీమేక్ చేస్తాడా అన్నది సస్పెన్స్ గా ఉంది.
ఇక ఇదే సమయంలో త్వరగానే “ఆచార్య” సినిమా రిలీజ్ చేయాలని ఆ తర్వాత మరో సినిమా స్టార్ట్ చేయాలని … సినిమాలు చేయడంలో చిరంజీవి స్పీడ్ పెంచినట్లు ఇండస్ట్రీ టాక్. రాబోయే రోజుల్లో వీలైనంత త్వరగా సినిమాలు స్టార్ట్ చేసి మరిన్ని సినిమాలు చేయాలని.. ఇండస్ట్రీలో ఉన్న కార్మికులకు పని కల్పించాలని చిరంజీవి ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా కరోనా తీసుకొచ్చిన గ్యాప్.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూడ్చలని .. అభిమానులను అలరించాలని చిరంజీవి అనుకుంటున్నారట.