తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా పేరుపొందిన అల్లు అరవింద్ ఓ ఓటీటీ ప్లాట్ఫాంను స్థాపించిన విషయం మనకి తెలిసినదే. అయితే ఇప్పుడు తన బిజినెస్ను మరింత విస్తరించడానికి ‘ఆహా’ బృందం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అరవింద్ ‘ఆహా ‘ కోసం కొత్త తరహా లో ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఒకపక్క స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో ‘ఆహా’ను ప్రమోట్ చేయిస్తూ మరోపక్క సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని తో ‘సామ్ జామ్’ అనే టాక్ షోను మొదలుపెట్టారు.
ఈ ‘సామ్ జామ్’ టాక్ షో కు తొలి ఎపిసోడ్ లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే. కానీ, ఈ ఎపిసోడ్ అనుకున్న రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందని చెప్పాలి. వెంటనే ‘సామ్ జామ్’ టాక్ షో ఫ్లాప్ అంటూ విమర్శలు వచ్చాయి. అందుకే అల్లు అరవింద్ ఈ షో కోసం చిరంజీవిని రంగంలోకి దించారట. నిజానికి మొదటిలో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ గా చిరంజీవి ఎపిసోడ్ను డిజైన్ చేశారట ఆహా బృందం. కానీ, షోపై సోషల్ మీడియా లో ఉన్న నెగిటివిటీ ని మార్చడానికి ఇప్పుడే చిరంజీవిని తీసుకొచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే, చిరంజీవి ‘సామ్ జామ్’ షోలో పాల్గొనడానికి వెళ్తున్నప్పటి లుక్స్, స్టిల్స్, షోలో పాల్గొన్న ఫొటోలు అప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. సామ్ అల్లరి – చిరు టైమింగ్ తో తెగ మురిసిపోతున్నారు మెగా ఫాన్స్… ప్రోమో చూస్తుంటే అల్లు అరవింద్ చేసిన ఆలోచన ఫలించేలా ఉంది. ఈ ఎపిసోడ్ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ చిరంజీవి రాక ఈ షోకు ప్లస్ అవుతుందో లేదో చూడాలి.