సినీ నటుడు రాజశేఖర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉంది అని అంటున్నారు. దీంతో ఆయన కుమార్తె శివాత్మిక ట్విటర్ ద్వారా తన తండ్రి త్వరగా కోలుకొని బయటకు రావాలి అని ప్రతి ఒక్కరు ప్రార్థించాలని విజ్ఞప్తి చేసింది. దీంతో శివాత్మిక చేసిన ట్వీట్ కి మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. నా స్నేహితుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. ధైర్యంగా ఉండండి అందరి ప్రార్థనలతో రాజశేఖర్ త్వరగా కోలుకుంటారు అని ట్వీట్ చేశారు. అంతేకాకుండా తన స్నేహితుడు రాజశేఖర్ ప్రాణాన్ని కాపాడటం కోసం చిరంజీవి సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి.
మేటర్ లోకి వెళ్తే చిరంజీవి రాజశేఖర్ నీ కాపాడుకోవటం కోసం ఓ ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వైద్యులు అంతా చాలా స్పెషలిస్టులు అని… వారిచేత ట్రీట్మెంట్ అందించి ఎలాగైనా రాజశేఖరుని కాపాడుకోవాలని చిరంజీవి ఆరాటపడుతున్నారట. అంతేకాకుండా ఎప్పటికప్పుడు రాజశేఖర్ హెల్త్ కండిషన్ తెలుసుకుంటున్నారట. గతంలో రాజశేఖర్ కి చిరంజీవి కి మధ్య చాలా సందర్భాలలో విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే.
“మా” అసోసియేషన్ కార్యక్రమాలలో అదేవిధంగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో రాజశేఖర్ కి చిరంజీవి కి మధ్య బేధాభిప్రాయాలు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే వాటన్నింటినీ పక్కన పెట్టి చాలా కష్ట సమయంలో చిరంజీవి రాజశేఖర్ ప్రాణాలను కాపాడటం కోసం ఆయన చేస్తున్న కృషి కి సోషల్ మీడియాలో నెటిజన్లు మెగాభిమానులు చిరంజీవి నిజమైన మానవత్వం కలిగిన మనిషి అని ప్రశంసలు కురిపిస్తున్నారు.