మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమాని మెగాస్టార్ తనయుడు రాం చరణ్ సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మణిశర్మ సంగీతమందిస్తున్నారు. రెజీనా కసాండ్ర ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.
ఆగస్టు 22 న ఆచార్య సినిమా నుంచి టైటిల్ తో పాటు చిరంజీవి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. రాం చరణ్, దర్శకుడు కొరటాల శివ అందుకు తగు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా 40 శాతం టాకీపార్ట్ అండ్ ఒక సాంగ్ కంప్లీట్ అయింది. త్వరలో మళ్ళీ షూటింగ్ ని ప్రారంభిస్తారని అంటున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఆచార్య సినిమా నుంచి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆచార్య లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ కీలక పాత్ర లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు 30 నిముషాలు చరణ్ ఆచార్య లో కనిపించబోతుండగా చిరు చరణ్ కలిసి ఒకే ఫ్రేం లో కలిసి ఫ్యాన్స్ ని సర్ప్రై చేస్తారట. చిరు, చరణ్ ల మధ్య ఒక అదిరిపోయే సాంగ్ తో పాటు ఓ బ్లాస్టింగ్ యాక్షన్ సీక్వెన్స్ ను కొరటాల తెరకెక్కించనున్నాడట. ఈ రెండు సినిమాకి ఎంతో హైలెట్ గా నిలవనున్నాయని అంటున్నారు.
ఇక చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఈ సినిమా 70 శాతం చిత్రీకరణ పూర్తయైంది. అలాగే చిరంజీవి ఆచార్య తర్వాత వి వి వినాయక్ దర్శకత్వంలో మలయాళ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ లో నటించనున్నారు. ఈ సినిమా కి సంబంధించిన అఫీషియల్ న్యూస్ అక్టోబర్ లో రానుందట.