Aacharya : మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆచార్య’. ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. పైగా మెగా తనయుడు రామ్ చరణ్ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమా రావడానికి ఇంకా చాలా సమయం ఉంది కానీ దీనికి సంబంధించిన అప్డేట్స్ తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతునే ఉన్నాయి.
ఇక ఈ సినిమా షూటింగ్ కు చిరంజీవి సడెన్ గా బ్రేక్ వేసినట్లు అని తెలుస్తోంది. ఇటీవలే భద్రాద్రి కొత్తగూడెం లో ఆచార్య షూటింగ్ కొత్త షెడ్యూల్ మొదలైంది. ఇల్లందు బొగ్గు గనుల్లో గత మూడు రోజులుగా ఎటువంటి గ్యాప్ లేకుండా చిరంజీవి షూటింగ్ లో పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఒక లుక్ కూడా లీక్ అయిన విషయం తెలిసిందే. కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో పూర్తి చేయాల్సి ఉంది.
అయితే మార్చి 15 వరకు జరగాల్సిన ఈ షూటింగ్ పనులకు ఇప్పుడు సడన్ గా బ్రేక్ పడింది. మెగాస్టార్ షూటింగ్ క్యాన్సిల్ చెప్పేసి రెస్ట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న అధిక ఉష్ణోగ్రతల కారణంగా అతని బాడీ డీహైడ్రేషన్ కు గురి అయినట్లు సమాచారం. ఉదయం పది దాటితే భద్రాద్రి సమీప ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. పైగా బొగ్గు గనుల్లో షూటింగ్ కాబట్టి అధిక ఉష్ణోగ్రతలు ఉన్నాయి.
ఇటువంటి సమయంలో ఆరోగ్యం పై రిస్కు తీసుకోవడం కరెక్ట్ కాదు అని చిత్ర యూనిట్ సభ్యులు చెప్పడంతో మెగాస్టార్ షూటింగ్కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. అలాగే ప్రస్తుతం ఆయన తన పర్సనల్ డాక్టర్ ద్వారా చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. మే 14వ తేదీన ‘ఆచార్య’ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ అయిపో కొరటాల పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.