తమిళ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన నటి విజె చిత్ర ఆత్మ హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్న ఆమె చెన్నైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఆత్మహత్య చేసుకున్న చిత్ర అంత్యక్రియలు నిన్న చెన్నైలోని బీసెంట్ నగర్ స్మశాన వాటికలో నిర్వహించారు.. బుల్లితెర ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. అయితే ఆమె పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం ఆత్మహత్య అని తేలిందని సమాచారం. దీనిపై పలు అనుమానాలు రేకెత్తాయి. ఆమె భర్త కొట్టి చంపారని ఆరోపిస్తున్నారు..!
అయితే ఆమె ఆత్మహత్య వెనుక బలమైన కారణాలు ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. రోజు తిరువాన్మియూర్ లోని ఇంటి నుంచి షూటింగ్ కి వెళ్లే చిత్ర నాలుగు రోజులుగా భర్తతో కలిసి హోటల్ లో ఎందుకు ఉంది..? ఆమె ముఖంపై గాయాలు ఎందుకు ఉన్నాయి..? పెద్దల సమక్షంలో నిశ్చితార్థం నిర్వహించి పెళ్లి ముహూర్తం ఖరారైయాక .. హేమంత్ రిజిస్టర్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నాడు..? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు.. రెండు రోజులుగా హేమంత్ ను అనేక కోణాల్లో విచారిస్తున్న పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. అసిస్టెంట్ కమిషనర్ సుదర్శన నేతృత్వంలో స్పెషల్ టీం ఈ కేసును దర్యాప్తు చేస్తుంది.
ఇక చిత్ర తల్లి హేమంత్ తన కూతుర్ని కొట్టి చంపేసాడు అని ఆరోపిస్తున్నారు. చిత్ర ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె మరణం వెనుక హేమంత్ హస్తం ఉందని ఆమె మీడియాతో చెప్పారు. తన కూతురి మరణం పై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేసింది. నిశ్చితార్ధం తరువాత హేమంత్ నిజస్వరూపం బయట పడింది దానితో వాళ్ళ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని చిత్ర తల్లి ఆరోపించింది. ఆత్మహత్య చేసుకుందని పోస్టుమార్టం రిపోర్టులో తేలిన విషయంపై ఆమె తల్లిదండ్రులు, బంధువులు మాత్రం దాన్ని కొట్టిపారేస్తున్నారు.