Chitram : చిత్రం సినిమా తో టాలెంటెడ్ డైరెక్టర్ గా తేజ టాలీవుడ్ లో అడుగుపెట్టాడు. అంతక ముందు సినిమాటోగ్రాఫర్ గా ఉన్న తేజ దర్శకుడిగా మారుతి చిత్రం సినిమాని తెరకెక్కిస్తూ టాలీవుడ్ కి ఉదయకిరణ్, రీమాసేన్ లను హీరో హీరోయిన్స్ గా పరిచయం చేశాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో రామోజీరావు ఈ సినిమాని నిర్మించారు. అప్పట్లో చిత్రం సినిమాని 40 లక్షల బడ్జెట్ లోపే తెరకెక్కించారు. రిలీజయ్యాక సంచలన విజయాన్ని అందుకొని దాదాపు 10 కోట్ల భారీ వసూళ్ళు రాబట్టి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
ఆ తర్వాత తేజ నువ్వు – నేను, జయం, ధైర్యం, నిజం, లక్ష్మీ కళ్యాణం లాంటి సినిమాలతో పాటు రానా – కాజల్ అగర్వాల్ లతో నేనే రాజు నేనే మంత్రి లాంటి సూపర్ హిట్ సినిమాలని తీశారు. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. కాగా తేజ గత కొన్ని రోజులుగా యాక్షన్ హీరో గోపీచంద్ తో అలిమేలుమంగ వెంకటరమణ అన్న సినిమాకి సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే రానా తో ఒక సినిమా చేయనున్నారన్న వార్తలు వచ్చాయి.
Chitram : ‘చిత్రం 1.1’ సినిమా షూటింగ్ మార్చి నెలలో ప్రారంభం కాబోతోంది.
కాని అనూహ్యంగా తేజ దర్శకుడిగా మారిన చిత్రం సినిమాకి సీక్వెల్ ని తెరకెక్కించబోతున్నట్టు తాజాగా ఆయన బర్త్ డే సందర్భంగా ప్రకటించి సర్ప్రైజ్ ఇచ్చారు. కాగా ఈ సినిమాని తేజ సొంత నిర్మాణ సంస్థ ‘చిత్రం మూవీస్’ తో పాటు ‘ఎస్ స్టూడియోస్’ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా ద్వారా ద్వారా 45 మంది నటీ నటులను తేజ ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. ‘చిత్రం 1.1’ సినిమా షూటింగ్ మార్చి నెలలో ప్రారంభం కాబోతోంది. ఆర్పీ పట్నాయక్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండటం విశేషం.